వేసవి కాలం వచ్చేసింది. పిల్లలకి కూడా సెలవులు వస్తున్నాయి. ఎండా కాలంలోనే పిల్లలకు సెలవులు. ఎటైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలన్న తపన చాలా మందిలో ఉంటుంది. అందుకే చల్లగా సేద తీరడానికో... సెలవుల్ని సరదాగా గడపడానికో... విహార యాత్రలకు వెళుతుంటాం. అయితే వెళ్లాలనుకున్న ప్రదేశాలపై ముందే ఓ అవగాహన ఉంటే తక్కువ ఖర్చుతో ఈ వేసవి సెలవులను ఎంజారు చేసిరావొచ్చు. మనం వెళ్ళే ప్రదేశాలు కుటుంబంతో కలిసి అందరూ సరదాగా గడిపే విధంగా ఉండాలి. అలా అనువుగా, సౌకర్యవం తంగా ఉండే టూరిస్ట్ ప్రదేశాలు మన దేశంలోనే ఎన్నో ఉన్నాయి. వేసవి కాలంలో ఈ ప్రదేశాలకు వెళ్ళడం వల్ల చల్లదనాన్ని ఆశ్వాదించడంతో పాటు ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ప్రకృతి ఒడిలో సేదదీరి దైనందిన జీవితంలో ఒత్తిళ్లు, కష్టాలు మరచిపోయి మళ్లీ తిరిగి వచ్చేటప్పుడు కొత్త శక్తిని మనసు నిండా నింపుకోని రావచ్చు. అలాంటి కొన్ని ప్రదేశాలు మీ కోసం...
ఔలి
హిమాలయాలను చూడాలనుకునే వారు ఉత్తరాఖాండ్లోని ఔలికి వెళ్లవచ్చు. చల్లని ప్రకృతి అందాలు ఈ ప్రదేశంలో కనువిందు చేస్తాయి. అలాగే త్రిశూల్ పీక్, చీనాబ్ లేక్, జోషిమఠ్, రుద్రప్రయాగ్, నంద ప్రయాగ్ వంటివి ఇక్కడ చూడదగిన ఆహ్లాదకరమైన ప్రదేశాలు. స్కైయింగ్, స్నో బోర్డింగ్ ట్రెక్కింగ్, క్యాంపింగ్, స్నో మొబైలింగ్, ట్యూబింగ్, రోప్ వే వంటివి ఎన్నో ఇక్కడ ఎంజారు చేయవచ్చు. డెహ్రాడూన్ ఎయిర్ పోర్ట్ లేదా హరిద్వార్ రైల్వే స్టేషన్కు చేరుకుంటే చాలు ఔలికి సులభంగా వెళ్ళిపోవచ్చు.
పురాతన భారతంలో విచ్చుకున్న వెస్టర్న్ ఫ్లవర్ ఈ డలౌసి. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబ జిల్లాలో ఉంది. హిమాలయాల పశ్చిమ శ్రేణుల్లో విస్తరించిన పర్వత ప్రాంతం ఇది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డలౌÛసి నిర్మించిన పట్టణం. అందుకే ఈ పట్టణానికి డలౌÛసి అనే పేరు వచ్చింది.ఈ ప్రదేశం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే స్విట్జర్లాండ్కు మీనియేచర్ రూపం. పచ్చదనం, మంచు తెల్లదనం ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంటుంది. రోడ్ల నిర్మాణం నుంచి చర్చిలు, పెద్ద బంగ్లాలు, ఓ మోస్తరు భవనాల నిర్మాణం వరకు ప్రతిదీ స్కాటిష్, విక్టోరియన్ వాస్తు శైలిలోనే ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపుగా రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంది డలౌసి పట్టణం.
శ్రీనగర్
ఏప్రిల్, మే నెలల్లో ఎంజారు చేయడానికి శ్రీనగర్ ఉత్తమమైన ప్రదేశం. పూలతోటలు, ఉద్యానవనాలు, వాటర్ ఫాల్స్, హౌస్ బోట్లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఇంకా దాల్ లేక్, నిషాత్ గార్డెన్, చష్మే షాహి గార్డెన్, షాలిమార్ బాగ్, దాచిగం నేషనల్ పార్క్, తులిప్ గార్డెన్, పరిమహఆల్ వంటి ప్రదేశఆలు ఇక్కడ చూడదగినవి. బోటింగ్, ఫిషింగ్, వైట్ వాటర్ రాఫ్టింగ్, కయాకింగ్, క్యాంపింగ్, సైట్ సీయింగ్ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.
కొడైకెనాల్
కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణాన్ని దాని అత్యద్భుతమైన అందం కారణంగా పర్వత యువరాణిగా అభివర్ణిస్తారు. సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తులో ఒక పీఠభూమి పై ఉన్న ఈ పట్టణం తమిళనాడు లోని దిండుగల్ జిల్లాలో ఉంది. కొత్తగా పెండ్లయిన జంటలు సరదాగా గడిపేందుకు అనువైన ప్రదేశం ఇది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండి మంత్రముగ్ధులని చేసే చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి. కోకర్స్ వాక్, బేర్ షోల జలపాతాలు, బ్య్రాంట్ పార్కు, కొడైకెనాల్ సరస్సు, గ్రీన్ వ్యాలీ వ్యూ, సహజ చరిత్ర కలిగిన శేమ్బగానుర్ మ్యూజియం, కొడైకెనాల్ సైన్స్ అబ్జర్వేటరీ, పిల్లర్ రాక్స్, గుణ కేవ్స్, సిల్వర్ కాస్కేడ్, డాల్ఫిన్స్ నోస్, కురింజి అండవార్ మురుగన్ ఆలయం, బెరిజం లేక్ వంటివి కొడైకెనాల్ లోను, చుట్టుపక్కల ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు. ఇక్కడ సందర్శించ దగిన అనేక చర్చిలు కూడా ఉన్నాయి.
తెక్కడి
కేరళలోని కుమ్లీ పట్టణానికి 4 కి. మీ. దూరంలో ఉంది ఈ తెక్కడి. ప్రకృతిని ఆశ్వాదించే పర్యాటకులకి తెక్కడి భూలోక స్వర్గమనే చెప్పాలి. తమిళనాడులోని మధురైకి 120 కి. మీ. దూరంలోను, కేరళలోని కొచ్చికి 180 కి. మీ. దూరంలోను, కొట్టాయం రైల్వే స్టేషన్కు 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెక్కడి ప్రాంతం వన్యప్రాణుల నిలయంగా ప్రసిద్డికెక్కింది. ఆహ్లాదం, ఆనందం పొందాలనుకునేవారు జీవితకాలంలో ఒక్కసారైనా తెక్కడి అందచందాలను వీక్షించాల్సిందే. తెక్కడికి వెళితే ముందుగా ఏనుగు స్వారీ చేయవలసిందే. మావటి చెప్పిన ప్రతి మాటా అది వినటం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. 'అంత పెద్ద ఏనుగు ముందు మనిషి ఎంత' అని మనకు అనిపిస్తుంది.
వయానాడ్
కేరళలోని ముఖ్యమైన హిల్ స్టేషన్లలో వయనాడ్ ఒకటి. దీన్ని 'గ్రీన్ ప్యారడైజ్' అని కూడా అంటారు. వ్యవసాయ క్షేత్రాలు, చిక్ని అడవులు, పచ్చటి కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యానికి స్వస్థత చేకూరుస్తుంది. వయల్ అంటే వరి పొలాలు. నాడు అంటే ప్రదేశం అని అర్థం. వయనాడ్కి దక్షిణాన 2100 మీటర్ల ఎత్తున చంబ్రా శిఖరం ఉంటుంది. అది ఎక్కడానికి శారీరక ధృఢత్వం ఉండాల్సిందే. కాని అది ఎక్కే అనుభవం ఎప్పటికీ మరువలేనిది. పైకి వెళ్లే కొద్దీ వయనాడ్ అందం కనులకు విందు చేస్తుంది. కొండ పైకి ఎక్కడానికి, దిగడానికి పూర్తిగా ఒక రోజంతా పడుతుంది. వయనాడ్ దగ్గర నీలిమల అనే ప్రాంతం ఉంటుంది. రకరకాల ట్రెక్కింగ్ దారులు ఉంటాయి. నీలిమల పైనుంచి చూస్తే పక్కనే కనిపించే మీన్ముట్టి జలపాతం అద్భుతంగా ఉంటుంది. మీన్ముట్టి జలపాతాల దగ్గరికి కూడా వెళ్లచ్చు. ఊటీని, వయానాడ్ని కలుపుతూ ఉండే రెండు కిలోమీటర్ల కొండ ప్రాంతం ఎక్కితే అతి పెద్ద మీన్ముట్టి జలపాతాల దగ్గరికి వెళ్లచ్చు. ఇంకో జలపాతం చేతాలయం. మీన్ముట్టి కంటె చిన్న జలపాతం. పలు జాతుల పక్షులు ఇక్కడ కనువిందు చేస్తాయి. పక్షిపాతాళం, బ్రహ్మగిరి కొండల్లో పదిహేడు వందల మీటర్ల లోపలికి ఉంటుంది. లోతైన లోయల్లో వింత వింత పక్షులు, జంతువులు, కనీవినీ ఎరగని జాతుల మొక్కలు ఉంటాయి. పక్షిపాతాళం, మనంతవాడీ దగ్గర ఉంది. అడవి నుంచి ఏడు కిలోమీటర్లు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలోనే అతి పెద్ద డ్యామ్ బానాసుల సాగర్. అలాగే వయనాడ్లో మసాలాలు, టీ, బాంబూ ఉత్పత్తులు, తేనె, హెర్బల్ ఉత్పత్తులు వంటివి కొనుక్కోవచ్చు
Authorization