సొంభద్ర ఉత్తరప్రదేశ్లోని రెండవ అతి పెద్ద జిల్లా. ఇది వింధ్య పర్వత శ్రేణులకు ఆగేయంగా వుంది. ఈ ప్రాంతంలో తూర్పు నుండి పడమటికి ప్రవహించే సోనే రివర్ ఎంతో అందంగా ఉంటుంది. సొంభద్ర పర్యాటన ద్వారా అనేక చారిత్రక, సాంస్కృతిక అంశాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ అనేక పురాతన స్మారకాలు, కోటలు, భవనాలు ఉన్నాయి. అందమైన ప్రాంతాలకు నెలవైన సొంభద్రలోని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం...
- సొంభద్రలోని విజ్ఞాన్ కోట 5వ శతాబ్దం నాటిది. దీనిని కోలి రాజులూ నిర్మించారు. దీనిలో అనేక గుహ పెయింటింగ్లు, శాసనాలు ఉన్నాయి. మరొక కోట నౌఘర్ కోట ఉంది. దీనిని కాశి రాజులు కట్టించారు. ప్రస్తుతం దీన్ని ప్రభుత్వ గెస్ట్ హౌస్గా మార్చారు. ఇక్కడే ఉండే అగోరి కోట ఎంతో అందమైనది. దీనికి మూడు పక్కలా మూడు నదులు ప్రవహిస్తాయి.
- కేవ్ పెయింటింగ్ సైట్లు (లఖనియ, పంచముఖి, కోవ కో, లకÛమా గుహలు)రాక్ ఆర్ట్ పెయింటింగ్లు గల ఈ గుహాలు వింధ్య, కైమూర్ శ్రేషులలో కలవు. అక్కడి అందమైన పెయింటింగ్లు ఆ నాటి ప్రజల జీవన విధానాలను తెలుపుతాయి.
- చంద్ర ప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురి ఎన్నో రకాల వన్య జీవులకు నెలవు. వీటిలో చితాల్, నీల్గాయి, చింకారా, బ్లాక్ బాక్, రాబిట్, సంభార్, మంకీ, ముళ్ళపంది, హయన, వైల్డ్ ఫాక్స్, వంటివి కొన్ని. పక్షి సందర్శకులకు ఇది ఓ మరువలేని ప్రదేశం.
- ఘోరమంగార్లోని ప్రకృతి దృశ్యాలు మనల్ని ఎంతో ఆనంద పరుస్తాయి. ఈ కేవ్ షెల్టర్లో ఆనాటి ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే అనేక పెయింటింగ్లు ఉన్నాయి. వేట, నృత్యాలు, యుద్ధ సన్నివేశాలు మొదలైన దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించారు. ఘోర మంగర్ రాక్ షెల్తెర్లో ఫ్రాగ్ డాన్స్ ఓ ప్రత్యేకత.
- రాజ్ దారి, దేవదారి వాటర్ ఫాల్స్ రెండూ కూడా ఉత్తర ప్రదేశ్లోని చంద్రప్రభ వైల్డ్ లైఫ్ సంక్చురిలో ఉన్నాయి. ఇది 65 మీటర్ల ఎత్తునుండి పడుతుంది. ఈ ప్రదేశంలో ప్రభుత్వం ఓ పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేసింది. దేవా దారి వాటర్ ఫాల్ రాజ్ దారి వాటర్ ఫాల్ నుండి సుమారు 500 మీటర్ల దూరంలో దిగువకు వుంటుంది.
- సల్కాన్ ఫాస్సిల్ పార్క్ సొంభద్ర జిల్లాలో కైమూర్ వైల్డ్ లైఫ్ సంక్చురిలో ఉంది. ఇది రోబెర్ట్స్ గంజ్ నుండి 17 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చెట్ల శిలాజాలు కలవు. భౌగోళిక శాస్త్రవేత్తల మేరకు ఈ శిలాజాలు 14000 మిలియన్ సంవత్సరాల నాటివిగా చెబుతారు.
- శివ ద్వార్ టెంపుల్ ఉత్తర ప్రదేశ్లోని రోబెర్ట్స్ గంజ్కు పడమటి భాగంలో 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ దేవాలయంలో శివ పార్వతులు వుంటారు. ఈ విగ్రహాలు సుమారు 11 వ శతాబ్దం నాటివి. చాలా ఆకర్షణీయంగా వుంటాయి. టెంపుల్ శిల్ప శైలి ఆనాటి కళలను చూపుతుంది.
- 400 అడుగుల పొడవైన విజయనగర్ కోట 5వ శతాబ్దంలో ఉత్తర ప్రదేశ్లోని సొంభద్ర జిల్లాలో కోల్ రాజులచే నిర్మించబడినది. ఈ కోటలో కేవ్ పెయింటింగ్లు, విగ్రహాలు, శిలా శాసనాలు, ఎప్పటికి ఎండిపోని కొలనులు చూడవచ్చు.
- లోరియా రాక్ సొంభద్ర జిల్లా హెడ్ క్వార్టర్ అయిన రోబెర్ట్స్ గంజ్ నుండి 10 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇది ఒక అతిపెద్ద రాక్, ఆకర్షనీయంగా వుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది.
- అగోరి కోట సొంభద్ర జిల్లాలో చోపాన్ నుండి 10 కి.మీ.లు రాబర్ట్స్ గంజ్ నుండి 35 కి.మీ.ల దూరంలో కలదు. ఇక్కడ పర్యాటకులకు చారిత్రక స్మారకాలు కనపడతాయి.
- ముఖ ఫాల్స్ సొంభద్ర జిల్లాలో శివ ద్వార్ నుండి 15 కి.మీ.లు, రోబెర్ట్స్ గంజ్ నుండి 55 కి.మీ.ల దూరంలో కలవు. ఈ జలపాతాలు దేవి మందిర్, కరియా తాల్ సమీపంలో కలవు. వర్షాకాలంలో ఈ జలపాతాలు అద్భుతంగా ప్రవహిస్తాయి.
- నౌఘర్ ఫోర్ట్ సొంభద్ర జిల్లాలో చకియాకు 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ కోటను కాశి రాజు కట్టించాడు.ఇక్కడ నుండి చుట్టుపక్కల గల ఆకర్షణీయ ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు.
Authorization