కొండ వంపుల నుండి వయ్యారంగా జాలువారే జలపాతాలు... గల గల ప్రవహించే నీటి సెలయేళ్ళు... పచ్చని ప్రకృతి సౌందర్యం... పర్యాటకుల మనసును ఆనంద డోలికల్లో ఊగిసలాడించే సుందర దృశ్యాలు.. ఇవన్నీ చిరపుంజీ సొంతం. ఏడాది పొడవునా వర్షపాతంతో తడిసి ముద్దయ్యే ఆ అందమైన ప్రదేశం గురించి మనమూ తెలుసుకుందాం...
మేఘాలయాలో ఉండే ఈ ప్రాంతాన్ని స్థానికులు చిరపుంజీ, సోహ్ర అని పిలుచుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మేఘాలయ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా చిరపుంజీని చెప్పుకోవచ్చు. అందుకే అందమైన వాతావరణంతో పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది.
ఏడాది పొడువునా కురిసే వర్షం
ఎత్తుపల్లాల కొండలు, అనేక జలపాతాలు, పచ్చని సువీశాల మైదానం, స్థానిక గిరిజన జీవనవిధానం మొత్తానికి అక్కడి ప్రకృతి సౌందర్యం చిరపుంజీ పర్యటనకు వెళ్లినవారికి ఓ అందమైన అనుభూతిని మిగుల్చుతుంది. చిరపుంజీ ఏడాది పొడవునా భారీ వర్షపాతం కురిసే ప్రాంతం. అయితే వ్యవసాయానికి మాత్రం అక్కడి భూమి పనికి రాదు. దానికి కారణం నిరంతర వర్షపాతంతో మట్టి బలహీనపడింది.
జలపాతాల నెలవు
నిరంతర వర్షపాతమే చిరపుంజినీ ఓ పర్యాటక ప్రదేశంగా మార్చివేసిందని చెప్పుకోవచ్చు. మవ్స్మై జలపాతం, నోహ్కలికై జలపాతం, దైన-త్లేన్ జలపాతం జెట్ వంటి జలపాతాలు ఇరుకైన కొండల నుంచి కిందికి జాలువారుతూ మరపురాని అద్భుతమైన దృశ్యాన్ని మన కండ్లుకు అందిస్తుంది. ఇక్కడ ఉన్న అందమైన నోహ్కలికై జలపాతం దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటి. చిరపుంజీలో పర్యాటకులు ఆనందంగా గడిపేందుకు సే-ఐ -మిక పార్క్ స్వాగతం పలుకుతుంది. అలాగే ఆహ్లాదభరితమైన రిసార్ట్స్లో సేద తీరుతూ చుట్టుపక్కల సౌందర్యాన్ని ఆశ్వాదించవచ్చు.
మవస్మవి గుహ
చిరపుంజీలో మవస్మవి గుహ ఎలాంటా సహాయం లేకుండా చేరుకోగలిగిన ప్రదేశం ఇది. సుదార ప్రాంతాల నుండి మొదటి సారి వచ్చిన పర్యాటలకు గైడ్ సహాయం లేకుండా అతి సులభంగా దాన్ని సందర్శించవచ్చు. 150 మీటర్ల పొడవు ఉండే ఈ గుహ లోపల వెలుతురు ధారాణంగా ప్రసరిస్తుంది. దాంతో కొత్తవారు తప్పిపోతారనే భయం ఉండదు. అందుకే దీనిలోకి ఎవరు వెళ్ళాలన్నా అనుమతి లభిస్తుంది.
మవ్సమై జలపాతం
మవ్సమై జలపాతం మేఘాలయలో ఉన్న అద్భుతమైన జలపాతాలలో ఒకటి. ఇది మవ్సమై గ్రామానికి అతి చేరువలో చిరపుంజీ మార్గంలో ఉంది. స్థానికంగా దీనిని నొV్ా్సంగిథిఅంగ్ జలపాతం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో నాలుగవ ఎత్తైన జలపాతంగా ఇది పేరు పొందింది. ఇంకా ఈ జలపాతాన్ని ''ఏడు ఈశాన్య జలపాతం'' అని ప్రముఖంగా పిలుస్తారు.
నోహ్కలికై జలపాతం
చిరపుంజీ సమీపంలో నోహ్కలికై జలపాతం భారతదేశంలో ఎత్తైన జలపాతంగా ఉంది. ఖాసీ పేరుతో పిలువబడే రుచికరమైన స్థానిక వంటల నుండి ఉత్తర, దక్షిణ భారత వంటకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. అలాగే స్థానికులు తయారు చేసిన చేతివృత్తులు దొరుకుతాయి. చిన్న చిన్న దుకాణాలు పెట్టి స్థానిక ప్రజలు వాటిని అమ్ముతుంటారు.
తన్గరంగ్ పార్క్
తన్గరంగ్ పార్క్ ఓ అందమైన ఉద్యానవనం. దీన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఉద్యానవన ప్రాంతం లోపల పార్క్తో పాటు గ్రీన్హౌస్ ఉంటుంది. ఈ గ్రీన్హౌస్లో వివిధ జాతులకు చెందిన మొక్కలు, చెట్లు మనల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇటువంటి పచ్చదనాల ప్రదేశంలో పిల్లలతో గడపితే ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదించవచ్చు.
దైన్-త్లేన్ జలపాతం
దైన్-త్లేన్ జలపాతం చిరపుంజీ సమీపంలో ఉన్న మరొక అద్భుతమైన జలపాతంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ''త్లేన్'' లేదా ఆ ప్రాంతంలో గుహలలో నివాసమున్న ఒక భారీ సర్పం (పైథాన్) నుండి దానికి ఆ పేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ అందమైన జలపాతంను చూడటానికి వస్తుంటారు. చిరపుంజీ మార్గంలో ఐదు కిలోమీటర్ల దూరంలో దైన్-త్లేన్ జలపాతం ఉన్నది.
పర్యావరణ పార్క్
చిరపుంజీ చుట్టూ పక్కల సందర్శించినప్పుడు మనకు కనిపించే అందమైన జంట పార్క్లలో పర్యావరణ పార్క్ ఒకటి. ఇది మేఘాలయ ప్రభుత్వంచే రూపొందించబడింది. పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటే అందమైన ఆకుపచ్చ కొండలు, లోయలు, సోహ్ర, దాని నుండి పుట్టిన జలపాతాలను ఆస్వాదించవచ్చు.
గ్రీన్ రాక్ రాంచ్
చిరపుంజీ ఆకర్షణల జాబితాలో గ్రీన్ రాక్ రాంచ్ ఒకటి. దీని లోపల గుర్రపు స్వారీ, సంప్రదాయ విలువిద్య, కొన్ని ఎకరాల ఆకుపచ్చ పచ్చిక భూమితో ఆసక్తికరమైన, ఆహ్లాదభరితమై సంస్థల సమ్మేళనంగా ఈ ప్రదేశం ఉంటుంది. పర్యాటకులు షిల్లాంగ్ నుండి కుటుంబాలతో వచ్చి గ్రీన్ రాక్రాంచ్లో ఆనందంగా గడుపుతుంటారు.
మరెన్నో ప్రదేశాలు
ఖోహ్ రంహహ్, కీన్రేం ఫాల్స్, నొంగ్సాలియా, సా-ఐ- మికా పార్క్ ఇలా ఎన్నో సుందరమైన ప్రదేశాలను మనం చిరపుంజీ పర్యటనలో చూడవచ్చు. అంతేకాదు నేచర్ వండర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్ పై నడిచి ఆనందించవచ్చు.
ఇలా వెళ్ళాలి
రోడ్డు మార్గం అయితే షిల్లాంగ్ నుంచి చిరపుంజీకి 55 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని చేరుకోవడానికి 2 గంటల పడుతుంది. అక్కడి అందమైన ప్రదేశాలను చూసేందుకు సందర్శకుల కోసం మేఘాలయ పర్యాటక శాఖ ప్రత్యేకమైన బస్సులను నడుపుతుంది. రైలు మార్గమైతే చిరపుంజీలో రైల్వే స్టేషన్ అందుబాటులో లేదు. గౌహతి రైల్వే స్టేషన్ చిరపుంజీ సమీపంలో ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ చిరపుంజీ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్ నుండి సోహ్ర చేరుకోవటానికి నేరుగా రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఇక విమానం ద్వారా వెళ్ళాలనుకునే వారికి గౌహతి విమానాశ్రయం నుండి చిరపుంజీ చేరడానికి నాలుగున్నర గంటల సమయం పడుతుంది.
Authorization