అది ఒకప్పుడు మహారాజుల తోట. రాజ కుటుంబీకులు కాలక్షేపం కోసం అప్పట్లో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేడు దేశ, విదేశ పర్యాటకులకు అందమైన పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. ఏటా ఆ తోటలను సందర్శించటానికి పాతిక లక్షల మంది వరకు వస్తుంటారని అంచనా. మైసూర్ దగ్గరలో ఉన్న ఆ ఉద్యానవనమే బృందావనం.
ఈ బృందావనం కర్నాటక రాష్ట్రంలో మైసూరు పట్టణానికి దగ్గరలోని కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర డ్యామ్కు ఆనుకొని ఉంది.ఈ ఉద్యానవనం మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 144 కిలోమీటర్ల దూరంలో కలదు. 1927లో ఈ ఉద్యానవనం పనులను ప్రారంభించి 1932 సంవత్సరం నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ను సందర్శిస్తుంటారు. మైసూరు ప్యాలెస్ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ను కూడా సందర్శిస్తుంటారు.
న బృందావన్ గార్డెన్స్కు నీటి కొదువలేదు. పక్కనే డ్యాం ఉండటంచేత నీరు నిరంతరం అందుబాటులో ఉంటుంది. అందుకే ఇక్కడ ఎప్పుడూ అందమైన మొక్కలు, పచ్చిక బయళ్ళు, ఫౌంటైన్లు కళకళలాడుతూ ఉంటాయి.
- సుమారు 60 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం మొత్తం చూసిరావటానికి రెండు, మూడు గంటల సమయం పడుతుంది.
- ఉదయం వేళ కంటే సాయంత్రం వేళ గార్డెన్ చూసేందుకు ఆహ్లాదంగా ఉంటుంది. సాయంత్రం తోటలను అందమైన రంగురంగుల విదుద్దీపాలతో అలంకరిస్తారు. అందమైన సంధ్యాసమయాన్ని ఆస్వాదించవచ్చు. బృందావనంలో లైట్లు ప్రతిరోజూ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల వరకు వెలుగుతాయి.
- చిన్న,పెద్ద ఫౌంటైన్ల నీటి పొంగులు, లైట్లతో అలంకరించబడిన ఉద్యానవనాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.
- దీనిని ఒకప్పుడు కృష్ణరాజ టెర్రస్ గార్డెన్స్ అని పిలిచేవారు. 1927లో ఈ ఉద్యానవనం పనులు ప్రారంభించి 1932లో పూర్తి చేశారు. కె. ఆర్. ఎస్. డ్యాం ను భారతరత్న విశ్వేశ్వరయ్య నిర్మిస్తే, ఉద్యానవనమును సర్ మీర్జా ఇస్మాయిల్ కట్టించెను.
- ఈ బృందావన్ గార్డెన్స్లో సంగీతానికి తగ్గట్లుగా ఆడే ఓ మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది. సరస్సు గార్డెన్లో బొటానికల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్, సరస్సులు ఉన్నాయి. సరస్సులలో బోట్ రైడ్ను కూడా ఎంజారు చేయవచ్చు.
- బృందావన్ గార్డెన్స్కు పక్కనే 2 హార్టీకల్చర్ పొలాలు, 75 ఎకరాలలో పండ్ల తోటలు ఉన్నాయి. ఇవేకాక నగవన 30 ఎకరాలలో, చంద్రవన 5 ఎకరాలలో విస్తరించి ఉన్నాయి.
- గార్డెన్స్ ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. ప్రతిరోజూ తెరిచే ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. శని, ఆది వారాలలో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అనుమతిస్తారు.
- బృందావన్ గార్డెన్స్ లోనికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. పిల్లలకు (5 నుండి 10 సంవత్సరాలు) - రూ. 5/-, పెద్దలకు రూ. 15/- ప్రవేశ రుసుము ఉంటుంది. గార్డెన్స్లో అనుమతి లేనిదే కెమెరా వాడకూడదు. కాదని వాడితే పెనాల్టీ 50 రూపాయలు.
- శని, ఆది వారాలు, సెలవు దినాలలో గార్డెన్స్కు వచ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ సమయంలో విద్యుద్దీపకాంతులు మరింతగా జిగేల్ మంటూ ప్రకాశిస్తాయి
- ఫౌంటైన్ షో ప్రతి రోజూ సాయంత్రం 6: 30 నుండి 7: 30 వరకు (సోమవారం శుక్రవారం), 6: 30 నుండి 8: 30 వరకు (శని, ఆదివారాలలో, సెలవు దినాలలో) ప్రదర్శిస్తారు.
Authorization