ఆకుపచ్చని లోయలు, మైదానాలు, కొండలతో కూడిన ఓ అందమైన ప్రదేశం త్రిపుర. భారతదేశంలో ఓ ప్రధాన పర్యాటక ప్రదేశంగా రూపొందింది. దేశంలోని మూడవ అతి చిన్న రాష్ట్రమైన త్రిపుర ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఓ చిన్న రాష్ట్రం. ఈశాన్య భారతదేశంలో ఏడు రాష్ట్రాలో ఒకటైనందున దీన్ని సెవన్ సిస్టర్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ది చెందిన పిక్నిక్ స్పాట్గా చెప్పుకునే అమర్పూర్లో చూడదగిన ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
త్రిపుర ఇరుకైన లోయలతో ఐదు కొండల ప్రాంతంగా విభజింపబడినది. ఇక్కడి కాలుష్యం లేని స్వేచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఆశక్తికర పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎవరైనా సందర్శించడానికి త్రిపుర ఓ అందమైన ప్రదేశం. త్రిపురలో సతత హరితారణ్యాలు విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి. అలాగే జలవనరులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న అమర్పూర్ ప్రాతం త్రిపురలో గోమతి జిల్లాల్లో సెంట్రిక్ టౌన్. ఈ చిన్న పట్టణానికి బస్సు ద్వారా త్రిపుర రాజధానికి అగర్తలా నుండి సులభంగా చేరుకోవచ్చు.
బోట్లో మాత్రమే: స్థానికులు దెబ్దాముర లేదా చంబిమురగా దీన్ని పిలుస్తారు. ఈ పర్వతం గోమతి నదీ తీరంలో ఉంది. ఇక్కడ రాళ్ళతో చెక్కిన శిల్పాలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. ఈ విగ్రహాలను పర్యాటకులకు కనువిందు చేస్తాయి. వీటిని పీక్ ఆఫ్ గాడ్స్గా పిలుస్తారు. ఈ శిల్పాలు 16వ శతాబ్ద కాలంలో చెక్కినట్టు చెబుతున్నారు. ఈ ప్రదేశం చూడాలంటే కేవలం బోట్లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది.
అమర్ సాగర్, ఫాతిక్ సాగర్ లేక్: ఈ ఆర్టిఫిషియల్ లేక్ 16వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని త్రిపుర రాజకుంటుంబంలోని రాజు అమర మానిక్య దేవ్ బర్మన్ నిర్మించారు. ఈ సరస్సు సుమారు 20 హెక్టార్లు విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సు పర్యాటకులను అద్భుతంగా ఆకర్షిస్తుంది. పిక్నిట్ స్పాట్గా , ప్రశాంత వాతావరణంలో సేద తీరాలని కోరుకునే వారికి చక్కటి ప్రదేశం. సరస్సు చుట్టూ కూర్చుని తినడానికి విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశాలున్నాయి.
మంగళ చంఢి దేవాలయం: అమర్ సాగర్ సరస్సుకు దక్షిణ భాగంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం మంగళ చంఢి దేవికి అంకితం చేయబడినది. ఈ దేవాలయంను 15 శతాబ్దంలో రాజు అమర దేవ్ బర్మన్ నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఈ దేవాలయంలో శిల్పసౌందర్యం ఇటు హిందు, బుద్దిజంకు దగ్గరగా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంప్రదాయ ఉత్సవాల్లో పాల్గొనడానికి స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రదేశాల నుండి భక్తులు తరలివస్తారు.
జంపు హిల్స్: జంపు హిల్స్ సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మిజోరాం వరకు విస్తరించి ఉంది. ఈ హిమగిరిల్లో సుమారు 10 గ్రామాలున్నాయి. మిజోరాంలో మిజో కమ్యూనిటీ జనసంఖ్య అధికంగా ఉండే ఈ ప్రదేశంలో వ్యవసాయం, హార్టికల్చర్ ప్రధాన వృత్తి. మిజోరాం ప్రజలు ఇక్కడ దాదాపు 15 శతాబ్ద కాలం నుండి స్థిరపడినట్లు స్థానికులు చెబుతారు. ఇక్కడ ఆరెంజ్, టూరిజం ఫెస్టివల్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఆరెంజ్ పండ్ల తోటలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాదు ఇక్కడ సూర్యాస్తమయాలు చూడటానికి రెండు కండ్లు చాలవు.
చేరుకోవాలంటే?
విమాన మార్గం: అమర్పూర్కు 65 కిలోమీటర్ల దూరంలో అగర్తలా ఎయిర్ పోర్ట్ ఉంది. ఎయిర్ పోర్ట్ చేరిన తర్వాత అక్కడ నుండి అమర్పూర్కు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళవచ్చు. విమానాశ్రయం నుండి రెండు గంటల సమయంలో అమర్పూర్ చేరుకోవచ్చు.
రైలు మార్గం: అమర్పూర్కు దగ్గరలో అగర్తలాలో ప్రధాన రైల్వేస్టేషన్ ఉంది. అక్కడ నుండి క్యాబ్ ద్వారా అమరపుర చేరుకోవచ్చు.
రోడ్ మార్గం: ప్రధాన నగరాల నుండి అమర్పూర్ చేరుకునేందుకు రోడ్డు మార్గం కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కారు, బస్సు ద్వారా ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
Authorization