సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుందీ కోట. అందుకే ఈ కోటను సోనార్ ఖిలా, గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తుంటారు. రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న అతి పెద్ద కోట ఇది. 1156లో రాజ్ పుత్ వంశానికి చెందిన రాజు రావల్ జైసల్ ఈ కోటను నిర్మించారు. ఈ కోట గోడలను పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు పడి ఆ గోడలు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటాయి. అందుకే ఈ కోటను గోల్డెన్ ఫోర్ట్ అని పిలుస్తారు.
- శత్రదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట గోడ 250 అడుగుల ఎత్తులో ఉన్న కోట పట్టణంలో ఎక్కడి నుండి చూసినా కనబడుతుంది. శత్రదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట గోడ 30 అడుగుల ఎత్తు కలిగి పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. జైసల్మేర్ సందర్శించే వారు రాజ్ పుత్ శైలిలో నిర్మించిన ఈ కోట లోపలి నిర్మాణాల సౌందర్యం చూసి తీరాల్సిందే.
-8 ఈ కోటనుత్రికుట్ ఘర్ అని కూడా పిలుస్తారు 'మేరు' అనే పర్వతం మీద కోటను , భవనాలను త్రికూట పర్వతం మీద నిర్మించినందున రాజభవనాలను త్రికుట్ ఘర్ అని కూడా పిలుస్తారు. త్రికుట కొండలపై త్రిభుజాకారంలో నిర్మించడంతో ఆ పేరు స్థిరపడిందని స్థానికులు చెబుతుంటారు.
- సాధారణంగా మనుషులు నివసించని కోటలే ఇప్పటి వరకు మనం చూసివుంటాం. కానీ ఈ కోటలో నేటీకీ జైసల్మేరు జనాభాలో మూడో వంతు ఈగోడల మధ్య వున్న నగరంలో నివసిస్తున్నారు. పెద్ద కోటగా ఉన్న ఈ గోల్డెన్ ఫోర్ట్ ముఖద్వారం నుండి లోనికి వెళితే కుడిచేతి వైపు రాజభవనాలు, ఎడమ చేతి వైపు మందిరాలు కనబడుతాయి.
- ఈ కోట అంతా బంగారు రంగు ఇసుక రాయితో నిర్మించడం వల్ల ఈ కోటను సోనార్ ఖిలా అని కూడా పిలు స్తుంటారు. ఉదయపు సూర్యకాంతిలో సింహం జూలు రంగులోనూ , అస్త మించే సూర్యకాంతిలో తేనె రంగులోకి మారుతుండడంతో రంగులు మారే కోట అని కూడా అంటుంటారు
- కోటలోని రాణీవాసాన్ని1500 అడుగుల పొడవు 750 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు వున్న గోడను నిర్మించారు. మొదటి గోడ రెండవ గోడలకు మధ్య 4000 మంది సైనికులు 56 చిన్న చిన్న సమూ హాలుగా మరుగుతున్న నూనె, నీళ్లు, రాళ్లతో తయారుగా వుంటారు . రెండవ మూడవ గోడల మధ్య విషనాగులు తిరుగుతూ వుండేటట్లు యేర్పాటు చేసారు . పదమూడవ శతాబ్దంలో అల్లావుద్దీను ఖిల్జీ ఎనిమిది సంవత్సరాలు సాగించిన పోరులో కోట పూర్తిగా ద్వంసం చెయ్యబడింది.
- కోటకు నాలుగు ప్రవేశ ద్వారాలు వున్నాయి. ముఖ్యద్వారం దగ్గర పెట్టిన ఫిరంగిని చూడొచ్చు. కోట చుట్టుపక్కల ప్రదేశం చాలా రద్దీగా వుంటుంది. ఈ ప్రాంతాలలో ఆటో ప్రయాణం సులువుగా వుంటుంది . సోనార్ ఖిల్లాలో ముఖ్యంగా చూడవలసినవి 'త్రికూట భవనం, జైనమందిరం, లక్ష్మీనాథ్ మందిరం. ఇవికాక వ్యాపార వేత్తల భనవాలు .
- కోటలోకి ప్రవేశించగానే ఎడమవైపున రాజభవనాలు, కుడి చేతివైపున జైన, లక్ష్మీనాధ్ మందిరాలు కొన్ని అడుగుల దూరంలో వుంటాయి. ఈ కోటలో మొత్తం ఏడు జైనమందిరాలు వున్నాయి. ఇందులో పార్శనాథుని మందిరం పెద్దది. చంద్రప్రభు, శీతలానాథుడు, కుంటునాధుడు, శాంతినాథుడు మందిరాలు వున్నాయి. జైనులకు ఇది పవిత్రస్థలం.
- పాలరాతితో నిర్మించిన మహారావల్ ప్యాలెస్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. రాజులు నివాస మందిరాలుగా ఉపయోగించుకున్న జవహర్ ప్యాలెస్ నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
Authorization