తమిళనాడులో థేని ఓ ముఖ్యమైన జిల్లా. ఇది పడమటి కనుమల ఒడిలో కలదు. ఓ వారాంతపు సెలవు రోజు ఈ ప్రదేశంలో హాయిగా గడపొచ్చు. ఈ జిల్లా లో పెరియకులం, ఉతమపలయం, అందిపత్తి వంటి ప్రదేశాలు ఉన్నాయి. అందిపత్తి హస్త కళా వస్తువులకు, చేనేతలకు ప్రసిద్ధి. మెత్తని టవల్స్, రుచికర మామిడి పండ్లు, చక్కని సిల్క్ కాటన్, సుగంధాల యాలకులు, తాజా కాఫీ గింజలు, గ్రీన్ టీకి ఈ ప్రాంతం ప్రసిద్ధి. అలాగే డాములు, దేవాలయాలు, జలపాతాలు ఇన్నో ఉన్నాయి.
సురులి ఫాల్స్
ఇది18 రాతి గుహలకు ప్రసిద్ధి. ఈ జలపాతాలు రెండు పాయలుగా ప్రవహిస్తాయి. 40 అడుగుల ఎత్తు నుండి కింద పడతాయి. ఈ నీరు ఒక మడుగులో పడి అక్కడ నుంచి తిరిగి110 అడుగులు కిందకు పడుతుంది. సురులి ఫాల్స్ మేఘమాలిలో పుడతాయి. ఇక్కడి రాతి గుహలు 18 వ శతాబ్దానికి చెందినవి. ఇవి థేని కి 47 కి. మీ. ల దూరం లో కలదు. తమిళ కవి ఇలంగో అడిగాల్ తన సిలప్పతికారం గ్రంధం లో ఈ జలపాతాల గురించి అందంగా వర్ణించాడు. ఈ జలపాతాల వద్ద అనేక ఔషధ వన మూలికలు దొరుకుతాయి. వాటర్ ఫాల్స్ నుండి అర కి. మీ. దూరం లో సురులి వేలప్పర్ టెంపుల్ కలదు. ప్రతి సంవత్సరం ఇక్కడ వేసవి ఫెస్టివల్ జరుగుతుంది. దీనిని తమిళనాడు టూరిజం శాఖ నిర్వహిస్తుంది. వర్షాకాలంలో ఈ జలపాతాలు పర్యాటకులతో ఆహ్లాదంగా మారిపోతుంది. ఇక్కడ స్నానపు గదుల సౌకర్యాలు కూడా ఉంది.
కుచానూర్
కుచానూర్లో వాడగురు టెంపుల్ ఉత్తరం వైపు తిరిగి వుంటుంది. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడే హనుమాన్ టెంపుల్, పంచ ముఖ గణపతి ఆలయాలు కూడా కలవు. మరో విషయం ఏమిటంటే సురభి నదీ పాయ కుచనుర్ గ్రామంలో నుండి ప్రవహిస్తుంది. సాని దేవాలయం ఈ నది ఒడ్డునే ఉన్నది. థేనికి కుచానూర్ 20 కి. మీ. ల దూరంలో ఉంది.
బోడి మెట్టు
థేని జిల్లాలో బోడిమెట్టు ఓ చక్కని హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉంది. విశ్రాంతి కొరకు పర్యాటకులు ఈ హిల్ స్టేషన్కు వస్తారు. ఇక్కడ జంతు, వృక్ష సంపద కలదు. అలాగే అరుదైన పక్షులను కూడా చూడవచ్చు. ఈ ప్రదేశం థే కి 43 కి. మీ. ల దూరం లో బోదినాయక నూర్ వెళ్ళే మార్గంలో ఉంది. థేని జిల్లాలోని అప్పిపత్తి , వేల్లయమపురం, పుసరి కౌన్దన్ పట్టి, ఓడయపత్తి, సేపలకోట్టాయి, సుక్కంగల్ పట్టి ప్రదేశాలు ఈ డాము నీటితో లబ్ది పొందుతాయి. డాము నుండి ఓ కి. మీ. దూరంలో శంముగా టెంపుల్ ఉంది. దీనిలో లార్డ్ మురుగా విగ్రహం వుంటుంది.
మేఘ మలై హిల్స్
పడమటి కనుమలలో థేనికి 70 కి. మీ. ల దూరంలో కలవు. సముద్ర మట్టానికి ఇది 500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశంలో సహజ వృక్ష, జంతు సంపద కలవు. సుమారు వంద రకాల పక్షులు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి జీవ వైవిధ్యం పరి రక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఓ వైల్డ్ లైఫ్ శాంక్చురి ఏర్పాటు చేస్తుంది. మేఘ మలై హిల్స్ అనేక జంతువులకు, సరీనృపాలకు, పక్షులకు నిలయం. ఇక్కడ చిరుతలు, పులులు, అడవి ఎలుగులు, నీలగిరి తార, ముండ్ల పంది, ఉడుతలు లేళ్ళు, జింకలు వంటివి ఎన్నో చూడవచ్చు. లవంగాలు, మిరియాలు ఇక్కడ సాగు చేస్తారు. ఇక్కడ నుండి సమీప ప్రాంతాలు ఎంతో అందంగా కనపడతాయి. ఈ ప్రదేశంలోనే మేఘమాలి ఫాల్స్, సురులి ఫాల్స్ పుడతాయి..
ఎలా వెళ్ళాలి?
థేనీని సంవత్సరంలో ఎపుడైనా సరే పర్యటించవచ్చు. ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి చేరవచ్చు. మదురైలో సమీప విమానాశ్రయం కలదు.
Authorization