తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అందమైన పర్యాటక నగరాలలో దిండిగల్ ఒకటి. దిండిగల్ అంటే 'దిండు' అంటే పిల్లో లేదా దిండు, 'కల్' అంటే రాయి. నగరానికి దగ్గరలో ఉన్న కొండలు దిండు వల ఉండటంతో దీనికి ఈ పేరు పెట్టారు. పాలని కొండలు , సిరుమలై కొండల మధ్యలో ఉన్న ఈ నగరం సారవంతమైన భూమితో వ్యవసాయానికి అనువుగా ఉంటుంది. దీనికి సమీపంలో ఉత్తరాన కారి, ఎరోడ్ జిల్లాలతో పాటు దక్షిణాన మదురై, పడమర తిరుప్పూర్, కేరళ ఉన్నాయి. అంతే కాక దిండిగల్ ప్రాంతాన్ని బిర్యానీ సిటీ, సిటీ అఫ్ లాక్స్ అండ్ టెక్స్టైల్స్ అండ్ టానరీ వంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు.
పర్యాటక ప్రదేశాలు
ఇక్కడి అద్భుతమైన కోటతో పాటు కొన్ని దేవాలయాలు, గలగలా ప్రవహించే నదులు ఈ ప్రదేశాన్ని అందమైన పర్యాటక ప్రదేశంగా మార్చేశాయి. దిండిగల్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ పంజంపట్టి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన రోమన్ కాథలిక్ చర్చ్ ఓ ముఖ్య ఆకర్షణ. అలాగే క్రీస్ట్ ది కింగ్ చర్చ్, సెయింట్ జోసెఫ్ చర్చ్ ఇక్కడ ప్రసిద్ధి చెందిన చర్చ్లు.
హిల్ రిసార్ట్
దిండిగల్ దగ్గరలోని సిరుమలై హిల్ రిసార్ట్ ఓ ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్. అలాగే ఈ పరిసర ప్రాంతంలో బెగంబుర్ బిగ్ మాస్క్, శ్రీ కొట్టి మరింమన్ కోవిల్, కాశి విశ్వనాథన్ టెంపుల్, కామాక్షి అమ్మన్ దేవదానపట్టి, తాడి కొంబు పేరుమల్ టెంపుల్, అబిరామి అమ్మన్ టెంపుల్, ఆంజనేయర్ టెంపుల్, అతూర్ కామరాజర్ లేక్, కమరాజార్ సాగర్ దమరె వంటివి సందర్శించదగినవి. వైగై, మరుడా, మంజలరు నదుల సంగమ స్థలాల్లో ఉన్న ప్రాంతం ఓ అందమైన పర్యాటక ప్రదేశం. మాల కొట్టై చిన్న కొండల వద్దకు ట్రెక్కింగ్ చెయ్యవచ్చు.
చిన్నలపట్టి
ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ప్రాంతం చిన్నలపట్టి. ఇక్కడి వంటలు కూడా దక్షిణ భారత దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందాయి. దిండిగల్ బిర్యానీకి ప్రఖ్యాతి. అందుకే దీన్ని బిర్యానీ సిటీ అని పిలుస్తుంటారు. పర్యటనలో ఇక్కడి వంటకాలను తప్పక రుచి చూడవలసిందే.
రాక్ఫోర్ట్
ఇక్కడి అతి ముఖ్యమైన మరొక పర్యాటక ఆకర్షణ కొండల పైన ఉన్న రాక్ ఫోర్ట్. దీన్ని దిండిగల్ పోర్ట్ అని కూడా అంటారు. ముత్తు కృష్ణ నాయకర్, మదురై రాజు 1605 లో ఈ ఫోర్ట్ నిర్మాణం మొదలుపెడితే 1623 నుండి 1659 వరకు పూర్తయింది. ఇది కొండలపైన 280 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 1755లో హైదర్ అలీ, అతని భార్య, అతని కుమారుడు అయిన టిప్పు సుల్తాన్తో దిండిగల్కి వచ్చాడు. 1784 నుండి 1790 వరకు టిప్పు సుల్తాన్ ఈ కోటను పాలించాడు. 1784లో టిప్పు సుల్తాన్ సేనాధిపతి ఈ కోటకి అనేక కొత్త గదులుతో పాటు బలమైన గోడలతో పునర్నిర్మించారు. 1790లో బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ని మైసూర్ యుద్ధంలో ఓడించాక ఇది వారి అధీనంలో కి వెళ్ళిపోయింది.
సేయింట్ జోసెఫ్ చర్చ్
1866 నుండి 1872 సంవత్సరాల మధ్య సేయింగ్ జోసెఫ్ చర్చ్ నిర్మించబడింది. 100 సంవత్సరాల కిందట నిర్మించబడిన ఈ చర్చ్ ఈ జిల్లాలోని రోమన్ కాతోలిక్ చర్చ్లలో ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇదే.
ఎలా చేరుకోవాలి?
దిండిగల్కి చేరుకోవడం చాలా సులభం. మదురై దిండిగల్కి సమీపంలో మదురై ఎయిర్పోర్ట్ ఉంది. అలాగే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంటుంది. దిండిగల్ రైల్వే స్టేషన్ అన్ని ప్రముఖ నగరాలకు కలపబడి ఉంటుంది. స్థానికంగా ఆటో రిక్షాలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి. వాతావరణం ఎండాకాలంలో వేడిగా ఉంటుంది. అందుకే వర్షాకాలం, చలికాలం పర్యటనకు అనువైన సమయం. వాతావరణం ఆహ్లాదంగా ఉంది పర్యటనకు అనువుగా ఉంటుంది. అందువల్ల సెప్టెంబర్ నుండి మార్చ్ వరకు అనువుగా ఉంటుంది.
Authorization