Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ జిల్లా, దామరచర్ల మండలంలోని ఓ చిన్న తండా. సరిగా రహదారులు కూడా లేని ఒక మారుమూల ప్రాంతం. అలాంటి తండాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారు ఆ తండా యువకుడు ధనావత్ అశోక్. అంతర్జాతీయ న్యాయ స్థానం ఉన్న ది హేగ్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్... ఐఐఎస్ఎస్లో మాస్టర్స్ చేయనున్నారు. 16 నెలల కోర్సు పూర్తి చేసేందుకు.. ఈ ఏడాదే నెదర్లాండ్స్కు వెళ్లాల్సి ఉన్నా... కరోనా పరిస్థితుల వల్ల అది వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది.
2019లో ప్రతిష్ఠాత్మక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టీఐఎస్ఎస్ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. సామాజిక సమస్యలపై లోతుగా పరిశోధన చేసే అశోక్ ఐఐఎస్ఎస్లో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందులో సీటు రావడంమంటే సామాన్యమైన విషయం కాదు. అనేక దశలలో జరిగిన వడపోతలను తట్టుకుని, చివరకు సీటు సంపాదించారు. తెలుగు రాష్ట్రాల్లో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, చంద్రన్న కానుక పథకాలపై పరిశోధన చేసి, స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రభుత్వాలకు నివేదిక కూడా అందించాడు అశోక్. లిబ్ టెక్ ఇండియా సంస్థ సమన్వయకర్తగా... అరకులో వివిధ సమస్యలు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాడు. నల్లమల అడవుల్లో చెంచుల జీవన విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. పరిస్థితులను స్వయంగా చూస్తేనే ఏం సమస్యలు ఉన్నాయో తెలుస్తుందని అనుకున్నాడు. నెదర్లాండ్స్ వర్సిటీలో చదవాలంటే చాలా వ్యయంతో కూడుకున్న పని. కానీ అరుదైన అవకాశం దక్కించుకున్న అశోక్... ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు తన సంపాదనంతా కుమారుడి చదువు కోసమే వెచ్చించిన తండ్రి మంగ్యా... విదేశానికి కొడుకుని పంపి, చదివించడం ఆయనకు ఆర్థికంగా అసాధ్యం. ఉన్నత చదువులు పూర్తయ్యాక ఆర్థిక, సామాజిక అసమానతల్లాంటి రుగ్మతలను రూపు మాపేందుకు కషి చేస్తానంటున్న అశోక్.. ఎంతోమంది యువతకు ఆదర్శం. అశోక్ 8 వరకు తెలుగులో మీడియంలో చదువుకున్నాడు. 9, 10, తరగతులకు ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేశాడు. ఇంటర్ APRJCలో హ్యుమానిటీస్ కోర్సెస్, బీ.ఏ సోషల్ సైన్సెస్ డిగ్రీని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో పూర్తి చేశాడు. తర్వాత ఐఐటీ గాంధీ నగర్లో వీAకి అడ్మిషన్ తీసుకున్నాడు
కానీ దాని కంటే నాణ్యమైన విద్యను అభ్యసించాలి అనీ ఐఐటీ నీ వదిలేసి ISSలో సీటు సాధించాడు . ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్లో డిగ్రీలు చేసినవారు ప్రపంచంలో ప్రముఖ రాజకీయ నాయకులుగా ఉన్నారు మన దేశంలోని ప్రముఖులు ఆర్బీఐ మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి, రాంజీ రగవాన్ (అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్), అశోక్ మిత్ర భారత ఆర్థిక వేత, దుర్గ శంకర్ మిశ్రా భారత పట్టణ, గహ నిర్మాణ శాఖ సెక్రెటరీ ఇంకా ఇతర ప్రముఖులు ఉన్నారు. అలాంటి ఇన్స్టిట్యూట్లో నల్లగొండ జిల్లా వాసి అశోక్ దనవత్ కి చదువుకునే అరుదైన అవకాశం వచ్చింది. ప్రపంచంలోనే డెవలప్మెంట్ స్టడీస్ విభాగానికి గొప్పగా పేరున్న ఐఎస్ఎస్లో M.A డెవలప్మెంట్ స్టడీస్కీ ప్రవేశం లభించింది. ఇది నెదర్లాండ్స్ లోనీ హేగ్ నగరంలో ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ ఎరముస్ యూనివర్సిటీలో భాగంగా అటానామస్గా నడుస్తున్నది.