Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృజనకు సరిహద్దులు లేవు.. కళకు ఎల్లలు లేవు.. అని నిరంతరం అదే ఒక తపనగా జీవిస్తున్న చిత్రకారుడు జమాల్ పూర్ మహేష్ కుమార్. తన కుంచెతో వేవేల చిత్రాలు గీస్తూ చిత్రకళా లోతులను స్పృశిస్తూ అక్షర ప్రేమికుల పుస్తకాలకు ముఖచిత్రాలుగా, విద్యార్ధులకు ప్రేరణ ఇస్తున్న ఉపాధ్యాయుడు మహేష్ పరిచయమే ఈ వారం జోష్...
కుటుంబం - చదువు
మా తల్లిదండ్రులు ప్రమీల బారు, కరణ్ లాల్. మాది మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి మా ఊరు లోనే చదువుకున్నాను. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో టెన్త్ పరిక్షలకోసం మిత్రుడి ఇంటికి వెళ్లి చదువుకునే వాడిని. ఇంటర్ లో కూడా చాలా కష్టపడి చదువుకున్నాను (కష్టం అంటే ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు)ఇంటర్ పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేకుంటే అర్థ శాస్త్రం బోధించే ఎస్.హనుమంతు సార్ సహకారంతో ఇంటర్ పూర్తి చేశాను.దీఖీA ఎంట్రన్స్ రాశాను. అందులో నాకు ఫోటోగ్రఫీలో సీటు వచ్చింది. కానీ నాకు పెయింటింగ్ మీద ఉండే ఇష్టంతో అందులో చేరలేదు.సాధారణ బిఏ డిగ్రీ లో ఎంవీఎస్ కళాశాలలో చేరాను. డిగ్రీలో చదువుతోపాటు ఇచ్చిన చిత్రకళ కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో పరీక్ష ఫీజు కట్ట లేని సమయంలో నా స్నేహితులు కానీ ఉపాధ్యాయులు కానీ నాకు ఎంతో ప్రోత్సహిస్తూ సహకరించారు. డిగ్రీ చదువుతూనే జిల్లా కేంద్రంలో వేసవికాలంలో చిత్రకళా శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తూ, నా చదువును కొనసాగించి డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి అయిన వెంటనే ప్రైవేట్ పాఠశాలల్లో చిత్రకళ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ వస్తున్నాను. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని పంచవటి విద్యాలయ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పని చేస్తూ, ప్రతిరోజు ప్రజలను చైతన్యపరిచే చిత్రాలను చిత్రిస్తూ, ఫేస్ బుక్లో, ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. వీక్షకుల నుంచి మంచి ప్రోత్సాహం అందుతుంది. 2010లో నిర్మలతో వివాహం జరిగింది. తాను టైలరింగ్ చేస్తూ మా కుటుంబానికి చేయూతను అందిస్తుంది. మాకు ఒక బాబు, ఇద్దరు పాపలు(కవలలు). బాబు కూడా స్వతహాగా ఆర్ట్ వేస్తున్నాడు.
మొదట గుర్తించింది నాన్నే
బాల్యంలో నేను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో నాలోని చిత్రకళ ఆసక్తిని గమనించి మా నాన్న నాకు చిత్ర కళలో శిక్షణ ఇప్పించడానికి చిత్రకళా శిక్షణా కేంద్రానికి నన్ను తీసుకెళ్లారు. కానీ చిత్రకళా శిక్షణ కేంద్రంలో చేర్పించ లేదు.నాకు డ్రాయింగ్ స్కెచ్ బుక్కు, పెద్దపెద్ద సీనరీస్, కలర్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు.అలా నా అభిరుచిని మా నాన్న బాల్యంలోనే ప్రోత్సహించారు.మా అమ్మకి చిత్రకళ గురించి తెలియకపోయినా నేను వేసే బొమ్మలు చూసి ముచ్చటపడేది.పాఠశాలలో చదివే రోజుల్లో ప్రెండ్స్ నేను చిత్రించిన చిత్రాలను చూసి అభినందించేవారు.ఉపాధ్యాయులు కూడా నన్ను మెచ్చుకునేవారు. 8వ తరగతి లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీసింగ్ హై స్కూల్లో చేరాను. డ్రాయింగ్ టీచర్ జెట్టి వెంకట్ స్వామి ప్రోత్సాహంతో చిత్రలేఖనంలో మెళుకువలు నేర్చుకున్నాను. టెన్త్ ఇంటర్ చదివే రోజుల్లో డ్రాయింగ్ లోయర్, హైయర్ పరీక్షలు రాసి, డ్రాయింగ్లో టిటిసి పూర్తి చేశాను. మహబూబ్ నగర్ జిల్లా స్థాయిలో నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో చురుకుగా పాల్గొని ప్రథమ,ద్వితీయ, తతీయ స్థానాలను సాధించే వాడిని. జిల్లా అధికారులు అయిన కలెక్టర్లు, ఎస్పీలు నాకు బహుమతిని ప్రదానం చేశారు.
కవర్ పేజీలుగా మారిన చిత్రాలు
పాలమూరు జిల్లాలోని కవుల పుస్తకాలకి కూడా 'ముఖ చిత్రాలన్నీ' చిత్రించాను. కవి వెన్నెల సత్యం రచించిన' బతుకు చెట్టు' 'మణిపూసలు, కవి భీంపల్లి శ్రీకాంత్ రచించిన 'పసిడి నానీలు', కవి ప్రభు లింగ శాస్త్రి రచించిన 'రామాలంబన,' 'అనుభూతి' పుస్తకానికి కవి కె.పి లక్ష్మీ నరసింహ రచించిన' నా ఆటోగ్రాఫ్' , 'ధర్మాగ్రహం', కవి రాము రచించిన 'రచ్చబండ' మొదలగు... పుస్తకాలకు ముఖచిత్రాన్ని చిత్రించాను . ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్ గోపి సత్కరించి సన్మానించారు.
ప్రముఖల చిత్రాలు ... ప్రశంసలు
మా జిల్లా కేంద్రానికి వివిధ సందర్భాలలో ప్రముఖులు వచ్చినప్పుడు వారి చిత్రాలను గీసి వారికి అందిస్తుంటాను. అలా మా జిల్లాకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ,మన రాష్ట్ర పూర్వ గవర్నర్ ఈఎస్ఎన్ఎల్ నరసింహం,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ,నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి లకు నేను వేసిన క్యారికేచర్స్ వారికి బహూకరించాను. అంతే కాకుండా ప్రముఖల చిత్రాలను కూడా గీశాను. కాళోజీ, దాశరథి,సినారె, కపిలవాయి లింగమూర్తి, మాజీ రాష్ట్రపతి కలాం వంటి వారి చిత్రాలతో పాటు సందర్భోచితంగా అనేక చిత్రాలను గీశాను. కరోనా కాలంలో వలసకార్మికుల కష్టాలను తెలిపే చిత్రాలను, సమాజాన్ని పట్టిపీడిస్తున్న బాల్య వివాహాలు, ఆడపిల్లలపై లైంగికదాడులు వంటి సమస్యలపై అవగాహన కలిగించే చిత్రాలను వేశాను. నిజామాబాద్ లోని ''లెట్ లైవ్ లెట్ లీవ్'' సంస్థ వారు 2018 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ చిత్రకారుడిగా గుర్తించి ''ఐడియల్ అవార్డుని'' అందించారు. 2008లో రాష్ట్ర స్థాయిలో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో చిత్రకళ పోటీలో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానాన్ని సాధించాను. ఈ అవార్డుని యువజన సర్వీసుల శాఖ అధికారి లవ్ అగర్వాల్, ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు గారు బహుకరించారు.
క్యారికేచర్స్... ఆకులపై ఆర్ట్
ప్రముఖ కార్టూనిస్ట్ శంకర్ వేసే క్యారికేచర్స్ నన్ను చాలా ఆకట్టుకునేవి. వాటిని చూస్తూ నా స్వతహాగా క్యారికేచర్స్ నేర్చుకున్నాను. ప్రముఖల చిత్రాలను క్యారికేచర్స్గా వేయడానికే ఇష్టపడతాను. అలాగే వీడియోలు చూస్తూ ఆకులపై చిత్రాలను వేయడంతో పాటు, వాటిని కట్ చేస్తూ కళాఖండాలుగా సష్ఠించే ప్రయత్నం చేశాను. రాష్ట్రస్థాయిలో రవీంద్రభారతిలో తెలంగాణ కార్టూనిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన కార్టూన్ ప్రదర్శనలో నా కార్టూన్ ప్రదర్శింపబడింది. నా కార్టూన్ ని చూసి తెలంగాణ భాషా సాంస్కతిక శాఖ అధికారి మామిడి హరికష్ణ అభినందించారు. మంచి సందేశాత్మక చిత్రాలు, ప్రజా చైతన్య చిత్రాలు, గొప్ప గొప్ప వ్యక్తుల క్యారికేచర్ చిత్రించడమే నా జీవిత ఆశయం.
సామాజిక చిత్రాలు..