Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనకున్న వినూత్న ఆలోచనలకు పదును పెడుతూ జీవం పోస్తున్నాడీ యువకుడు తనదైన రీతిలో సూక్ష్మ కళలో రాణిస్తూ.. పెన్సిల్ నిబ్బుపై, సుద్దముక్కపై, సబ్బుబిల్లపై, బియ్యపు గింజ ఇలా వస్తువు ఏదైన సరే అతడి చేతిలో అద్భుతమైన కళాకండమై తీరాల్సిందే. అతడే నర్సంపేటకు చెందిన శ్రీరామోజు జయకుమార్. ఈ మైక్రో ఆర్టిస్ట్ పరిచయ కథనమే ఈవారం జోష్..
చూడ్డానికి అతను అతి సామాన్యడు బోలెడంత సజనాత్మక అతనిలో దాగి ఉంది. అతను కళాఖండాలు సష్టిస్తాడు, కానీ మనం వాటిని చూడలేం! అతను అక్షరాలను వ్రాస్తాడు, కానీ మనం వాటిని చదవలేం! బియ్యపు గింజలు మన ఆకలిని తీరుస్తాయి, కానీ ఆ గింజలే అతనికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నాయి! కొన్ని దశాబ్దాల క్రితమే అతడు కంటికి కనిపించని సూక్ష్మ కళాఖండాల అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.అతనే వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్. బిక్షమాచారి,భద్రమ్మ దంపతుల కుమారుడైన జయకుమార్ బాల్యం నుండే వినూత్నంగా ఆలోచించేవాడు. జయకుమార్ 1995 నుండి తన కళను ప్రపంచానికి చాటి చెపుతున్నారు.
వెండి, బంగారు వత్తిని చేసుకునే జయకుమార్ సూక్ష్మ కళాఖండాలను ప్రవత్తిగా ఎంచుకుని తన ఊరికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారు. కుక్క పిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేది కవితలకు అనర్హం అన్న శ్రీ శ్రీ కవితా స్పూర్తితో తను చేసే కళాఖండాలు కేవలం వెండి, బంగారంతోనే కాకుండా బియ్యపు గింజ ఆవగింజ, గురివింద గింజ, లక్క, పిక్క, సుద్దముక్క, చింతాకు, రావి ఆకు, పెన్సిల్ ములుకు, బాదం పలుకు, కురులు, తిలలు...కావేవి కళాఖండాలకు అనర్హం అంటూ వాటిపై అద్భుతమైన కళాఖండాలను సష్టిస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలకు అనుగుణంగా జయకుమార్ సష్టించే కళాఖండాలు సమాజానికి విలువైన సందేశాన్ని చేరవేస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోరుతూ, చారిత్రక సంపదను, మతసామరస్యాన్ని, సంస్కతి సంప్రదాయాలను కాపాడాలని, హింస మార్గాన్ని విడనాడాలని, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, జలచర జీవరాశులను సంరక్షించుకోవాలని, కాలుష్యాన్ని నియంత్రించుకోవాలని, జాతీయ సమైక్యతను పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక భావాలు పెంపోందించుకోవాలని, అవినీతి రహిత సమాజం కొరకు పాటు పడాలంటూ, తెలుగు భాషను మరచి పోవద్దంటూ, తన సూక్ష్మ కళాఖండాల ద్వారా సమాజానికి సందేశాన్ని అందిస్తున్నారని జయమార్ను రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, సంఘనాయకులు అభినందిస్తూ సన్మానాలు చేశారు. 2005లో టెస్టు క్రికెట్లో అత్యదిక సెంచరీలు చేసిన సచిన్ టెండుల్కర్కు బహుమతిగా కేవలం 20 మిల్లి గ్రాముల బంగారంతో బ్యాట్ను తయరుచేసి శుభాకాంక్షాలు తెలియాజేశారు.
ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ '25 సంవత్సరాలుగా కళా సేవ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని వాపోయారు. వత్తి పై ఆధారపడిన తనకు కళాఖండాల సష్టి కోసం సమయం కేటాయించడం వల్ల ఉపాదిని కోల్పోతున్నట్టు తెలిపారు. ఒక కళాఖండాన్ని తయారు చేయడం ఒక రోజులో పూర్తికాదని నాలుగైదు రోజులు ప్రయత్నిస్తే గానీ తయారుకాదన్నారు. ఒక కళాఖండాన్ని తయారు చేయడానికి శ్వాసను ఆపుకుని, బతికున్న శవంలా మారిపోయి పూర్తి చేస్తానని, ఎందుకంటే శ్వాసను తీసుకుంటే చేయి కదిలి కళాఖండం చెడిపోతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం సహకరించి,,తనకు ప్రత్యేక మ్యూజియంను గాని లేదా తన కళాఖండాలను ఇతర మ్యూజియంలో గాని ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.దష్టి ఉన్నంత కాలం కళా సష్టి చేస్తూనే ఉంటానని' జయకుమార్ తెలిపారు.
- కాసుల రవికుమార్
లీడ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు.
9908311580