Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువత ఆలోచనలకు కొదవ లేదు. కేవలం వారి ఆలోచనలు కాగితాలకే పరిమితం అయితే ఆవిష్కరణలకు అర్థం లేదు. ముఖ్యంగా విద్యార్థుల ఆలోచనలు నూతన ఆవిష్కరణలుగా రూపు దిద్దుకుంటున్నాయి. అయితే విద్యార్థులుగా తాము తయారు చేసిన పరికరాలను అక్కడే వదిలేయడం లేదు. ఈ ఆలోచనాపరులు వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ధైర్యం ఉన్నవారు స్వయంగా స్టార్టప్లు పెడుతున్నారు. నేటి ఈ చిన్న ఐడియాలు రేపటి స్టార్టప్గా మారనున్నాయి. ఈనాటి స్టూడెంట్సే రేపటి సీఈవోలుగా మారనున్నారు. చుట్టూ ఉన్న సమాజాన్ని అందరమూ చూస్తాం. కొందరు మాత్రమే నిశితంగా పరిశీలిస్తారు. సమస్యల్ని కనిపెట్టి వాటికి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఒక్కరి ఆలోచనా ఆచరణా ఫలిస్తే లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. దీనంతటికి సైన్సే ప్రధాన కారణం.
''సైన్సేలే! జగతికి మూలం! సైన్సు లేక సాగదు కాలం అణువు అణువు సైన్స్ మన ప్రతి తనువు సైన్సు'' అంటాడు ప్రజా కవి శేషగిరి. అందుకే సమాజంలో మానవాళి కోసం విద్యార్థులు విద్యార్థి దశ నుంచే సైన్స్పై ఆసక్తి పెంచుకుని పరిశోధనలపరంగా నూతన ఆవిష్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వారు చేసిన కొన్ని ఆవిష్కరణలను సైన్స్ డే సందర్భంగా తెలుసు కుందాం.. సైన్స్డే శుభాకాంక్షలతో ఈ వారం జోష్...
డెస్కిట్
స్కూల్ బ్యాగులు లేక చాలా మంది పిల్లలు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లో పుస్తకాలు తెచ్చుకోవడం, స్కూల్లోనూ, ఇండ్ల దగ్గర కూడా పిల్లలు రాసుకునేందుకు బల్లలు లేకపోవడం గమనించాడు కాన్పూర్ ఐఐటీ విద్యార్థి ఈషన్ సదాశివం. చిన్న చిన్న పిల్లలు ఇలా వంగిపోయి రాయడం ఆ లేత వెన్నెముకలు అలా వంగిపోతే ఎంత దెబ్బతింటాయో అని భయం నుండి పుట్టిన ఆలోచనే 'డెస్కిట్'. పుస్తకాలు తీసుకువచ్చే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను దూరం చేయడంతో పాటు వంగకుండా రాయడం కోసం చిన్న బల్లను కూడా వారికి అందుబాటులోకి తెచ్చింది ఈషన్ 'డెస్కిట్'. అందుకోసం అనేక ప్రయోగాలు చేశాడు. ఈషన్ సదాశివం నడు పుతున్న స్టార్టప్ కంపెనీనే డెస్కిట్.
రేప్ ప్రూఫ్ ప్యాంటీ
అత్యాచారాలకు గురవకుండా మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఈ అమ్మాయి ఓ సరికొత్త 'రేప్ ప్రూఫ్ ప్యాంటీ'ని రూపొందించింది. ఉత్తర్ప్రదేశ్లోని ఫరూకాబాద్కు చెందిన 19 ఏళ్ల ఈ యువతి పేరు సీనూ కుమారి. తాను డిజైన్ చేసిన ప్యాంటీతో మహిళలు అత్యాచారాల నుంచి తప్పించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ వినూత్న ఆవిష్కరణకు కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.
ఈ ప్యాంటీ ప్రత్యేకత ఏంటి?
బ్లేడుతో దాడి చేసినా చిరగని ప్రత్యేక వస్త్రంతో ఈ ప్యాంటీని రూపొందించారు. నిప్పు అంటించినా ఇది అంత సులువుగా కాలిపోదట. అంతేకాదు.. ఈ ప్యాంటీలో ఓ స్మార్ట్ లాక్, జీపీఆర్ఎస్, వాయిస్ రికార్డింగ్ పరికరాలు కూడా అమర్చి ఉన్నాయి.
''పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ప్యాంటీలోని స్మార్ట్ లాక్ తెరుచుకుంటుంది. దానికి ఓ బటన్ ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఆ మీటను నొక్కితే చాలు.. జీపీఆర్ఎస్ ద్వారా వెంటనే 100 నంబర్కు ఫోన్ కాల్ వేళ్తుంది. బాధితుల లొకేషన్తో పాటు, చుట్టూ వచ్చే శబ్దం కూడా పోలీసులకు వెంటనే చేరిపోతుంది. దాంతో పోలీసులు వెంటనే బాధితులను కాపాడేందుకు వీలుంటుంది'' అని సీనూ కుమారి వివరించారు. ''ఇందులో కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను కూడా పొందుపరచొచ్చు. తొలి కాల్ ఎవరికి వెళ్లాలో సెట్ చేయాల్సి ఉంటుంది. అత్యవసర సమయాల్లో పోలీసులు వెంటనే స్పందించేందుకు వీలుగా ఉంటుందని 100 నంబర్ను సెట్ చేశాము'' అని సీనూ తెలిపారు.
ఆవిష్కరణల ప్రణవ్
సాంకేతిక ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన వ్యక్తులలో ప్రణవ్ మిస్త్రీ ఒకరు. ఇది కంప్యూటింగ్ ప్రపంచం అనడంలో సందేహం లేదు. ప్రణవ్ మిస్త్రీ ప్రోగ్రామింగ్ పరిజ్ఞానంతో డిజైన్ను ఫ్యూజ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని నిజమైన దూరదృష్టి కలవారిలో ఒకడు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో, మీడియా ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో ఎంఏ, ఇండిస్టియల్ డిజైన్ సెంటర్ నుండి మాస్టర్ ఆఫ్ డిజైన్, పిహెచ్.డి. అందుకున్నాడు. మిస్త్రీ మైక్రోసాఫ్ట్ తో యుఎక్స్ పరిశోధకుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం, అతను శామ్ సంగ్ లో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా థింక్ ట్యాంక్ టీం అధిపతి పని చేస్తున్నారు. తన చదువు పూర్తయ్యేలోపు, ప్రణవ్ మిస్త్రీ తన సృజనాత్మకతలతో మౌస్లెస్- అదృశ్య కంప్యూటర్ మౌస్, స్పార్ష్- డిజిటల్ పరికరాల మధ్య కాపీ చేసి పేస్ట్ చేయడానికి ఒక వినూత్న మార్గం, బ్లింక్బాట్- ఒక చూపు, బ్లింక్ నియంత్రిత రోబోట్ , ఒక థర్డఐ పెన్, క్వికీస్- ఇంటెలిజెంట్ స్టిక్కీ నోట్స్, సిక్స్త్సెన్స్లో ఇలా ఒకటేమిటి ఇరవైకి పైగా పరిశోధనులు చేసి అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, యుబిక్విటస్ కంప్యూటింగ్ జెస్టరల్ ఇంటరాక్షన్, మెషిన్ విజన్, సామూహిక మేధస్సు, రోబోటిక్స్ వంటి చాలా ఆసక్తులు ఉన్నాయి. మిస్త్రీ స్వయం ప్రకటిత డిజైనర్
సిక్స్త్ సెన్స్ అనేది ఇప్పటివరకు ప్రణవ్ మిస్త్రీ అత్యంత ఉత్తేజకరమైన ఆవిష్కరణలు. మేము శారీరకంగా సంకర్షణ చెందుతున్న ఉపరితలాలు, వస్తువులను దృశ్యపరంగా పెంచే పరికరాన్ని వినియోగదారులు ధరించడాన్ని సాంకేతికత చూస్తుంది. ఇది డిజిటల్ సమాచారంతో మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని అనుకరించే సంకేతాలను ఇంటర్ ఫేస్ను ఉత్పత్తి చేస్తుంది. సిస్టమ్ ఒక కెమెరాను, ఒక చిన్న ప్రొజెక్టర్ను దాని సహజ నిర్బంధాల నుండి రియాలిటీతో అనుసంధానించడం ద్వారా సమాచారాన్ని విడిపించేందుకు ప్రయత్నిస్తుంది. తద్వారా యూజర్ మొత్తం ప్రపంచాన్ని వారి కంప్యూటర్లో ప్రదర్శిస్తుంది. ఈ సాంకేతికత కృత్రిమ మేధస్సు నిజజీవితం రెండింటి కొత్త వ్యవస్థలను రూపొందించడంలో నిస్సందేహమైన శక్తి.
విజయాలు
- 2009, టెక్నాలజీ రివ్యూ నుండి టిఆర్ 35 అవార్డు విజేత
- పాపులర్ సైన్స్, ఇన్వెన్షన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత
- 2009 TED స్పీకర్ అవార్డ్
- 2009, డిజిట్ మ్యాగజైన్ చేత యంగ్ ఇండియన్ ఇన్నోవేటర్ విజేత
- 2010, సృజనాత్మకత 50 జాబితా ద్వారా అత్యంత ప్రభావ వంతమైన, సజనాత్మక వ్యక్తిత్వాలలో ఒకటిగా జాబితా చేయబడింది
- 2011, ఆసియా సైంటిస్ట్ మ్యాగజైన్ వీక్షించిన 15 ఆసియా శాస్త్రవేత్తలలో ఒకరిగా జాబితా చేయబడింది
- 2012, క్రిస్ ఆండర్సన్ చేత ప్రస్తుతం ప్రపంచంలోని పది ఉత్తమ ఆవిష్కర్తలలో ఒకరిగా పేరు పొందారు
- 2012, +Qచే అత్యంత శక్తివంతమైన డిజిటల్ ఇండియన్లలో ఒకటిగా జాబితా చేయబడింది
- 2012, యంగ్ అలుమనస్ అవార్డు, ఐఐటి బొంబాయి
- 2013, యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం
ఐ - దియా
కరెంటు పోయినా లేదా మనం ఏదైనా ప్రయాణంలో ఉన్నా చీకటిలో మనకు ఒక లైటు కావాలి కదా! చార్జింగ్ లైట్స్ వచ్చాయి కానీ మనం దానిని కేవలం లైట్గా వాడతాం. ఎక్కడికైనా వెళ్లినప్పుడు దాని తీసుకువెళ్లాంటే అది ఒక పెద్దపని. బోంబే ఐఐటీలో చదివిన సచిన్ మూడేళ్ల పరిశోధనే 'ఐ-దియా'. ఇది చేతిలో ఇమిడిపోయే అంత చిన్న పరికరం. సౌరశక్తిని గ్రహించి విద్యుత్ శక్తిగా మార్చుకోగలిగితే అటు పర్యావరణ హితంతో పాటు ఇటు వెలుగులు కూడా పంచుతుంది. అంతే కాదు ఐ-దియా లైట్ కం సెల్ ఫోన్ ఛార్జర్. ఇప్పుడు సచిన్ కుమార్ '' ఇల్యూమైండ్ సోలార్ ట్రెక్ '' అనే పేరుతో బుల్లిబుల్లి సౌరదీపాలను తయారుచేసే స్టార్టప్ ను ప్రారంభించాడు.