Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ ప్రవాహంలో పాఠకులను నిండా ముంచగల ముగ్దమనోహరమైన పదాలతో సరికొత్త వ్యక్తీకరణలతో ప్రేమ కవితలను గుమ్మరించే కలం అతనిది. తనదైన శైలిలో నిత్యం మదిని పులకింపజేసే కవి, రచయిత చిలకమారి తిరుపతి పరిచయ కథనం ఈవారం జోష్..
అన్నారం కోటపెల్లి . మండలంలో ఆయుర్వేద . బ్రాహ్మగా పేరుపొందిన . లచ్చయ్య, కమల .
నాల్గో సంతానంగా 21 ఆగస్టు 1985లో తిరుపతి జన్మించాడు. చిన్నతనంలోనే తన తండ్రి సంతాన సాపల్యత కోసం తప్పనిసరి ఆయుర్వేదాన్ని తిరుపతి కి నేర్పించడం జరిగింది. తన తండ్రి చెప్పిన కథలన్నీ వింటూ అనేక విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. స్వగ్రామం అన్నారంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తిరుపతి.. చెన్నూర్ లో ఎనిమిదో తరగతి చదువుతుండగానే అలతి మలతి పదాలతో కవిత్వం రాసేవాడు. పర్యావరణ దినోత్సవం, మహిళా దినోత్సవం, ఉపాధ్యాయులు దినోత్సవం లాంటి అంశాలపై రాసిన కవితలు తెలుగు ఉపాధ్యాయులు సత్యనారాయణ చారి మన్ననలు పొందారు.
చిన్నతనం నుంచే దైవభక్తి ఉండడం తో గ్రామంలో ప్రతి గురువారం,ఆదివారం సత్యసాయి భజనా కార్యక్రమంలో ప్రతివారం ఓ కొత్త పాట తానే స్వయంగా రాసుకొని పాడి అందరినీ అలరించేవాడు. పదోతరగతి పూర్తి చేసిన సంవత్సరం లో తండ్రి ఆకస్మిక మరణంతో కుంగిపోయిన తిరుపతిని .. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు కొంతకాలం చదువుకు దూరం చేశాయి. ఆ రెండు సంవత్సరాల కాలంలో తాను గమ్యాన్ని చేరుకోలేనేమోనని ఆలోచిస్తుండగా ఒక మంచి వ్యక్తి ప్రేరణతో మళ్ళీ చదువు పునః ప్రారంభం చేశారు.ఇలా ఇంటర్మీడియట్, డిగ్రి,పిజి పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ పొందారు.
ఉపాధ్యాయుడుగా...
చిన్ననాటి నుండి గురువుల ప్రోత్సాహంతో ఎదిగిన తిరుపతి కి.. ఉపాధ్యాయ వత్తిపట్ల అత్యంత గౌరవం. అందుకే తాను ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే ఉక్కు సంకల్పంతో శ్రీ సరస్వతి శిశుమందిర్ శాఖ పాఠశాలలో ఉపాధ్యాయ్యుడిగా పాఠాలు చెబుతూనే.. డి ఎడ్ పూర్తి చేసుకొని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఎందరో విద్యార్థుల మనసుల్లో మంచి ఉపాధ్యాయుడుగా స్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. విద్యా వాలాంటీరుగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని విధులను ఏక ఉపాధ్యాయునిగా పాఠశాల మొత్తాన్ని నిర్వహించాడు. తెలుగుభాషపై మమకారం ఇంకా రెట్టింపు కావడంతో తెలుగు పండిత శిక్షణ తరగతులు స్వీకరించడానికి సిద్ధపడ్డాడు.
సాహిత్య ప్రస్థానం
చిన్నగా రెండు మూడు వాక్యాల కవిత్వం రాయడం ప్రారంభించాడు. గురువుల ప్రోత్సాహకాలు అందడంతో కవిత్వం అప్పటి కప్పుడు రాయగల సామర్థ్యము పొంది మిత్రుల సలహాలను తీసుకొని తను రాసిన కవితలకు ప్రణయ ప్రవాహం అనే వచన కవితా సంపుటి అని నామకరణం చేసాడు. ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలామంది ప్రేమికులు కవితలు అడిగేవారటా, వారి భావాలు తనవిగా భావించి కవితలు రాసిచ్చి వారి ప్రేమకు వారధి వేశారు. 2012లో ఉస్మానియా విద్యార్థులతో పరిచయం ఏర్పడ్డాక ఓ మిత్రుని తోడ్పాటుతో మార్కండేయ చరిత్ర అనే చంపూ కావ్యాన్ని చంధోరంజీతమనే నూతన లాక్ష్యనిక గ్రంథంలోని ప్రవీణం అనే పద్యాలలో కేవలం ఆరు రోజుల్లోనే రాశారు. మిత్రుని ఆర్థిక సహాయంతో పుస్తకం ముద్రణ సాధ్యపడింది. చెన్నూరు సాహితీ వేదికను స్థాపించడంతో దానిలో వ్యవస్థాపక కార్యదర్శిగా చురుకుగా పనిచేసాడు. త్వరలో చెన్నూరు సాహితీ వేదికకు అధ్యక్షత వహించనున్నారు.
చిలుక పలుకులు అనే కొత్త సాహిత్య వచన ప్రక్రియను సజించి జాతీయస్థాయిలో చిలక మారి లచ్చయ్య స్మారక సాహిత్య కవితా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథలు, చారిత్రక, జానపద కథలు మొత్తం ఐదు వరకు రాశాడు. దేశభక్తి, దైవభక్తి గేయాలు,సూక్తులతో శ్రీ మంజునాథ శతకం రాస్తున్నాడు. నిత్యము సాహిత్యరంగంలో కషిచేయాలనేదే తిరుపతి అభిలాష.
పురస్కారాలు- సన్మానాలు
అవధాన రాజధాని ఢిల్లీలో 2014లో జరిగిన మాడుగుల నాగఫణిశర్మ సహస్రావధానం లో పచ్ఛకుడుగా పాల్గొని సత్కారం అందుకున్నారు. యువకళా సమితి చెన్నూరు ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయిలో తన కవితకు నీర్ల మధనయ్య సాహితీ పురస్కారం వచ్చింది.
తానా ప్రపంచ స్థాయి నాన్న పురస్కారం 2020 పొందాడు. అఖిల భారతీయ సాహిత్య పరిషత్తు వారి రాజశ్రీ పురస్కారం 2020, పున్నమి పురస్కారం 2020, యాదాద్రి శిల్పకళా వైభవ పురస్కారం, వంగూరి ఫౌండేషన్ వారి యువసాహితీ సమ్మేళనంలో బహుమతి పొందాడు. సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థచే ప్రవీణం సరస్వతీ పుత్రులు అనే బిరుదును పొందాడు.
సాహిత్యం సమాజ హితాన్ని కోరుతుంది. పురస్కారాల కోసం బిరుదుల కోసం సాహిత్యం రాయడం లేదు. సమాజంలో మంచి మార్పు రావాలనే ఉద్దేశ్యం తో రచనలు చేస్తున్నాను. స్త్రీలను గౌరవించడం మన సనాతన భారతీయ సంస్కతి అని చాటి చెప్పడంలో నేను ముందుంటాను. అదే దిశగానే ముందుకు సాగుతున్నాను. ఎన్నో కవితల్లో ఈ విషయాన్ని క్రోడీకరించి నవ తెలంగాణ నిర్మాణం కోసం సాహిత్యం రాస్తున్నాను. ప్రభుత్వం కూడా సాహితీవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందని అంటున్నాను.
- కిషన్ బాబు