Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రెండు మారుతోంది. అమ్మాయిలంతా ఇప్పుడు అబ్బాయితో సమానంగా దూసుకుపోతున్నారు. చదువుల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ కొందరు అమ్మాయిలు తమ ప్రతిభ నిరూపించుకుంటున్నారు. ఆటపాటల్లో అగ్రభాగాన ఉంటున్నారు. అబ్బాయిలకన్నా తాము ఎక్కువే అంటూ మార్కులు కొట్టేస్తున్నారు. అబ్బాయిల్లో పెరుగుతున్న పరధ్యానం, తగ్గుతున్న ఏకగ్రతే ఇందుకు కారణమని తెలు స్తోంది. నిర్లక్ష్య వైఖరి, లక్ష్యసాధనపై అనాసక్తి వల్ల కూడా అబ్బాయిలు రాణించలేకపోతు న్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోర్ వీలర్ డ్రైవింగ్లోనూ అబ్బాయిలకన్నా అమ్మాయిలే పర్ఫెక్ట్ అని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా మగవాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ చక్కగా, సురక్షితంగా డ్రైవింగ్ చేస్తారని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదని ఆ అధ్యయనం సారాంశం తేలింది. అబ్బాయిల పరధ్యానం కారణంగా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని వెల్లడైంది. యాక్సిడెంట్కి గురైన లేదా యాక్సిడెంట్ చేసిన ప్రతి 10 మంది అబ్బాయిల్లో ఒకరికి పైగా.. తమ పరధ్యానం కారణంగా ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చారు. కానీ అదే అమ్మాయిల విషయానికొచ్చే సరికి ప్రతి 20 మందిలో ఒకరు మాత్రమే తమ పరధ్యానం కారణంగా ప్రమాదాలకు గురైనట్టు చెప్పారు. ప్రతి మూడో అబ్బాయి ఏకాగ్రత లోపించిన కారణంగా కొన్నిసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకున్నట్టు చెప్పారు. అదే అమ్మాయిల విషయంలో ప్రతి ఐదో అమ్మాయి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
ఈ ప్రమాదాలకు సంబంధించిన పరధ్యానానికి గల సర్వసాధారమైన కారణం కార్ స్టీరియోను అడ్జస్ట్ చేయడం. 76 శాతం మంది స్టీరియోను అడ్జస్ట్ చేస్తూ రోడ్డుపై ద అ ష్టిని కోల్పోయి ప్రమాదాలకు గురైనట్టు వెల్లడైంది. శాంటండర్ ఇన్సూరెన్స్ సర్వే ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. మూడొంతుల్లో రెండొంతుల మంది సాఫ్ట్ డ్రింక్ సేవించడం మూలంగానో లేక ఏదైనా తినడం వల్లనో పరధ్యానానికి లోనైట్టు చెప్పారు. మొబైల్ ఫోన్ వినియోగించడం వల్ల ప్రమాదాలకు గురైనట్టు వెల్లడైందని సర్వేలో తేలింది. 96 శాతం మంది డ్రైవర్లు కారు నడుపుతుండగా టెక్స్టింగ్ (మేసేజింగ్) చేయడం ప్రమాదకరమని చెప్పగా.. చాలా మంది ఇప్పటికే అదే పనిని చేస్తున్నట్టు తెలిపారు.