Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర చాలా ముఖ్యమైనది. సరిగా లేకపోతే ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. పుష్టిగా నిద్రపోకుండా నాలుగైదు గంటలతో సరిపెట్టుకుంటే మన శరీరాన్ని మనం హింసించుకున్నట్టే. ఈ విషయంలో నేటితరం నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు నిపుణులు. నేటి యువతలో 31 మంది శాతం సరిపడా నిద్రపోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్యాన్నిచ్చేవి ఆహారం, వ్యాయామం మాత్రమే కదా.. అంటూ నిద్రను పోగొట్టుకుంటున్నారని అంటున్నారు పరిశోధకులు. నైట్ అవుట్ చదువులు, పార్టీలు, సినిమాలతో నిద్రను దూరం చేసుకుంటున్నారని చెబుతున్నారు. రాత్రివేళ నిద్రపోవలసినంత సమయం నిద్రపోకపోతే జీవ గడియారం దెబ్బతింటుంది. అలసిపోతే నిద్రవస్తుందనుకుంటారు కొందరు. కానీ అలసట రెండురకాలు... శారీరకమైనది, మానసికమైనది. శారీరక అలసటతో కొద్ది సమయం నిద్రపోతే తేరుకుంటాం. కానీ మెదడును ఉపయోగించి చేసే నాడీశ్రమ వల్ల కలిగే అలసట నుంచి తేరుకునేందుకు చాలా సమయం పడుతుంది. నిజానికి మానసిక శ్రమ చేసే వాళ్లు సరిగా నిద్రపోవటంలేదు. నైట్ షిఫ్ట్లు, టెలివిజన్ ప్రసారాలు, ఇంటర్నెట్, ఫేస్బుక్ ఇవన్నీ నిద్రనుమాయం చేసేవేనని అంటున్నారు. యుక్త వయసులో పుష్టిగా నిద్రపోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.