Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకవైపు వీడియో చూస్తుంటాం. మరో వైపు వాట్సాప్ మెసేజ్ టోనర్ వినిపిస్తుంది. వెంటనే ట్విట్టర్లో కూత... మరుక్షణంలో ఫేస్బుక్ నోటిఫికేషన్. ఇవి చాలదన్నట్టు స్కైప్లో కాల్... ఈ మధ్య కాలంలో ఇంతగా బిజీ అయిపోయాం. సోషల్ మీడియా స్మార్ట్ అయ్యాక చాలామందికి ఇలా మల్టీ టాలెంట్ చూపక తప్పట్లేదు. కానీ మల్టిపుల్ సోషల్ మీడియా యాక్టివిటీస్తో మల్టిపుల్ కష్టాలు తప్పవంటున్నారు నిపుణులు. లిప్తపాటులో సామాజిక మాధ్యమాలన్నీ చుట్టేయటం అలవాటైతే డిప్రెషన్లోకి వెళ్లిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇతరులతో పోలిస్తే యంగ్ ఏజ్లో ఉన్నవారిలో ఈ రిస్క్ మూడింతలు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అమెరికాలోని పిట్స్బర్గ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ స్టడీ నిర్వహించారు. అందులో బాగంగా 19-32 ఏండ్ల మధ్య ఉన్న 17,50 మందిని ప్రశ్నించారు. ఏడు నుంచి పదకొండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుతున్నవారు. యాంగ్జైటీకిలోనై డిప్రెషనలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందట. ఒకటి లేదా రెండు యాప్లతో దోస్తే చేస్తే ఎలాంటి ప్రమాదమూ లేదంటున్నారు. అయితే మరీ ఎక్కువ సమయం వాటితోనే గడిపినా డిప్రెషన్ తప్పదని సెలవిస్తున్నారు.