- సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వినతి
- కలెక్టరేట్ ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ-పెద్దపల్లి
ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ బిక్ష కాదని ప్రాథమిక హక్కని సీపీఎస్ ఉద్యోగులు అన్నారు. సీపీఎస్ను రద్దు చేసి, ఓపీఎస్ను పునరుద్దరించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యచరణ సమితి ఆధ్వర్యంలో సోమవారం భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టరేట్ ముందు నల్లా బాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్ ప్రభాకర్రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్బండా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా నేటికి అలాగానే మిగిలిపోవటం బాధకరమన్నారు.రెండు దశాభ్దాల నిరక్షణ తరువాత ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి వస్తున్న నేఫధ్యంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలన్నారు.అలాగే పాత పెన్షన్ విధానం అమలు అయ్యే వరకు జేఏసీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటాలు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు పి.శ్రీనివాస్, సారయ్య, సదానందం, శ్రీరామ శ్రీనివాస్, రాజిరెడ్డి, సంపత్కుమార్, సంతోష్కుమార్, మధుసూధన్రెడ్డి, పోచయ్య, భీమయ్య, కనుకయ్య, లక్ష్మణ్, సధాశివ, శ్రీనివాస్, తిరుపతి, రాజు, ఆనందరావు, శ్రీకాంత్రెడ్డి, సంపత్, సత్యనారాయణలు పాల్గొన్నారు.
Authorization