- చార్వాక వృద్ధుల సంక్షేమసంఘం మండల అధ్యక్షుడు అల్లూరి రాజిరెడ్డి నవతెలంగాణ-రుద్రంగి వయోవృద్ధులకు ప్రభుత్వం ఉచిత బస్పాసులు అందించాలని చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు అల్లూరి రాజిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని చార్వాక సంఘం కార్యాలయంలో సంఘ సభ్యులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో వృద్ధులకు 50శాతం రాయితీ ద్వారా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వృద్ధులను గుర్తించి ఉచిత బస్సుపాస్లను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షులు జక్కుల లింగారెడ్డి, రుద్రంగి గ్రామ అధ్యక్షులు బోయిని గంగారాం, మానాల గ్రామ అధ్యక్షులు కొమ్ముల రాజిరెడ్డి, సభ్యులు తెల్లాల గంగారెడ్డి, పండుగు గంగారెడ్డి, బొబ్బిలి లస్మవ్వ, రామవ్వ, నర్సవ్వ పాల్గొన్నారు.