- చాకలి ఎస్సీ సాధన సమితి కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మీ
- సిరిసిల్లకు చేరిన పాదయాత్ర
నవతెలంగాణ-సిరిసిల్ల
రజకులను ఎస్సీల్లో చేర్చేవరకు ఉద్యమిస్తామని చాకలి ఎస్సీ సాధన సమితి కన్వీనర్ కొత్తకొండ లక్ష్మీ అన్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలని కోరుతూ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సోమవారం సిరిసిల్లకు చేరుకుంది. అంబేడ్కర్ చౌరస్తా మీదుగా కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రతో తరలివచ్చిన నాయకులు జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాకలి ఎస్సీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ కొత్తకొండ శ్రీలక్ష్మీ మాట్లాడుతూ రజకులను ఎస్సీల్లో చేర్చాలని కోరుతూ 31 జిల్లాల్లో మహాప్రస్తానం, చాకలి మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది రజకులు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉంటే తెలంగా ణ రాష్ట్రంలో బీసీ-ఏ ఉన్నారని, రానున్న అసెంబ్లీ సమావేశంలో రజకులను ఎస్సీలో చేర్చుతూ తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. రజకుల అభివృద్ధి, కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు నామినేషన్ పోస్టులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని, రజకుల సత్తా ప్రభుత్వానికి చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు కాసర్ల వెంకటేశం, కాసర్ల బాలయ్య, మల్లేషం, మైలారం తిరుపతి, దండు శ్రీను, పెద్దూరు తిరుపతి, నేరెళ్ల శంకర్, కంచర్ల పరశురాం పలువురు నాయకులు పాల్గొన్నారు.
Authorization