- అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
- పోలీసుల జోక్యంతో విరమణ
- తహసీల్దార్కు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ శివారులోని పాలకేంద్రం వద్ద దళితులకు 1962 సంవత్సరంలో దళితుకిచ్చిన ప్రభుత్వ భూమి సర్వే నెం. 126/2లోని మూడెకరాల భూమిని దళితులకే ఇవ్వాలని అఖిల పక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. దీక్ష శిబిరం నుంచి ఎల్లారెడ్డిపేటపాత బస్టాండ్ వరకు అఖిలపక్షం కమిటీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ఊరేగింపుగా వెళ్లి పాత బస్టాండ్లో రాస్తారోకో చేశారు. దీనితో కామారెడ్డి - సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకుని ఏఎస్ఐ శంకర్నాయక్ ఆందోళన కారులను శాంతింపజేశారు. అనంతరం అఖిలపక్ష కమిటీి నాయకులు కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి తరలివెళ్ళారు. అనంతరం తహసీల్దార్ మధుసూదన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ 1962లో ప్రభుత్వ భూమి దళితులకిచ్చిన భూమి దళితులకే వదిలి పెట్టాలని, అది వదిలిపెట్టేదాకా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. స్థానిక జెడ్పీటీసీ బెదిరింపులు మానుకుని దమ్ము, ధైర్యం ఉంటే పాల కేంద్రం చుట్టు పక్కల ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు డబుల్బెడ్రూంలు కట్టి ఇవ్వాలన్నారు. ఇంత జరుగుతున్న దళితుల గురించి మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకపోవడం శోచనీమన్నారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు కత్తెర దేవదాసు, దళిత సంఘాల నాయకులు రాగులు రాములు, జక్కుల యాదగిరి, అఖిలపక్ష కమిటి కన్వీనర్ బండారిబాల్రెడ్డి, అఖిలపక్ష కమిటి నాయకులు దోమ్మాటి నర్సయ్య, చాకలి రమేష్ కానపురం లక్ష్మన్, ఆకుల రాములు, పందిర్ల నారాయణగౌడ్, దళిత నాయకులు అందె చంద్రయ్య, గర్జనపల్లి మాజీ సర్పంచ్ మనువాడ ప్రశాంత్, గద్దరాశి భగవంతం, జంగం మధు, మస్కూరి నగేష్, అఖిలపక్ష కమిటీ నాయకులు పాల్గొన్నారు.
Authorization