నవతెలంగాణ-సిరిసిల్ల రేగులగుంట మల్లన ఆలయానికి వెళ్ళే దారిని మళ్ళించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామస్తులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన రేగులగుంట మల్లన్న ఆలయానికి వెళ్లే తారురోడ్డును ప్రయివేట్ సోలార్పంప్ నిర్వాహకులు పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆలయానికి వెళ్లే దారిని మళ్ళించడంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొం దని కలెక్టర్కిచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. తక్షణమే ఆలయానికి వెళ్లే దారిని పునరుద్దరిం చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొమ్మెన ఆంజనేయులు, ఉప సర్పంచ్ చెర్లపెల్లి సుధాకర్రెడ్డి, వార్డు సభ్యులు గున్నాల రమేష్గౌడ్, కనుకయ్య, ఆలయ పూజారులు పాల్గొన్నారు.