- రోడ్డుపై నిర్మించిన మెట్లను కూల్చివేస్తున్న టౌన్ప్లానింగ్ అధికారులు నవతెలంగాణ-వేములవాడ పట్టణంలోని శివసాయినగర్లో నూతనంగా నిర్మాణం చేపట్టిన రెండు ప్రయివేట్ ఆస్పత్రుల యజమానులు అనుమతులకు విరుద్దంగా నిర్మాణం చేయడంతో నగరపంచాయతీ టౌన్ప్లానింగ్ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా టౌన్ప్లానింగ్ అధికారి అంజయ్య మాట్లాడుతూ ఆస్పత్రి యజమానులు నగరపంచాయతీ ఇచ్చిన పర్మిషన్ను అతిక్రమించి వారి ఆస్పత్రుల ఎదుట సీసీప్లోరింగ్, ట్రాన్స్ఫార్మర్, రహదారికి మెట్లు నిర్మాణం చేయడంతో వాటిని కూల్చేసినట్టు తెలిపారు. శివసాయినగర్లో 40 ఫిట్ల రహదారి ఉండగా సుమారుగా 11 ఫిట్ల వరకు ఆస్పత్రి యజమాన్యాలు రోడ్డుపైనే మెట్ల నిర్మాణం మరో ఆస్పత్రి యజమాన్యం సీసీ ప్లోరింగ్ ట్రాన్స్ఫార్మర్, జనరేటర్ ఏర్పాటు చేశారని వీటిని తొలగించాలని ఆదేశాలు జారీచేసిన యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో కూల్చివేశామన్నారు. పట్టణంలో పర్మిమిషన్ను అతిక్రమించి నిర్మాణం చేపట్టిన వాటిని నగరపంచాయతీ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నట్టు తెలిపారు.