నవతెలంగాణ - ఎల్లారెడ్డిపేట ప్రయివేట్ పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మండలం కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పెంచాల రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రయివేట్ పాఠశాల లో నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజుల వసూలు చేస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ఫీజుల పేరిట పేద విద్యార్థులను నిలువు దోపిడి చేస్తున్నా రు. మరోవైపు కనీస అర్హత లేనటువంటి ఉపాధ్యాయుల చేత విద్యాబోధన చేస్తున్నారని, బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25%ఉచిత విద్య అందించాలని, కానీ ఆ చట్టాన్ని ఏ ప్రయివేట్ పాఠశాలలు పాటించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు దినాకర్, అజరు, స్వామి, ప్రణీత్, రాజేష్ పాల్గొన్నారు.