- వేములవాడరూరల్ తహసీల్దార్ మునీందర్ నవతెలంగాణ-వేములవాడరూరల్ సీపీఎస్ రద్దుకోసం డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీన చీకటి దినంగా పాటించాలని వేములవాడ రూరల్ తహసీల్దార్ మునీందర్ అన్నారు. వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మునీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు అయ్యేంతవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.