నవతెలంగాణ-కరీంనగర్రూరల్ బుడిగెజంగాల కాలనీలో గుడిసెలు తొలగించాని రేకుర్తి గ్రామస్తులు సోమవారం తహశీల్ధార్ రాజేందర్రావును కలిసి వినతి పత్రం అందించారు. కొత్తపల్లి మండలంలొని రేకుర్తి గ్రామానికి చెందిన జాడి బాల్రెడ్డి, జాడి భూమయ్య, గొల్లపల్లి తిరుపతి, జాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ.. గ్రామంలోని సర్వేనెంబర్ 128, 132లలో 3ఎకరాల 36 గుంటల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ భూమి అసైన్డ్ కావడంతో హైకోర్టు నుంచి స్టేటస్ తెచ్చుకున్నట్టు పేర్కొన్నారు. కానీ కొందరు పెద్దలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు బుడిగజంగాల కులస్థుల వద్ద డబ్బులు తీసుకుంటు కోర్టు ఆర్డర్లో ఉన్న భూమిని కబ్జా చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్కు, రెవెన్యూ డివిజన్ అధికారి, తహశీల్దార్కు దరఖాస్తులు ఇచ్చినట్టు తెలిపారు. కోర్టు ఇచ్చిన స్టేటస్ ఆధారంగా న్యాయం చేయాలన్నారు.