నవతెలంగాణ - కరీంనగర్రూరల్
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోందని శాసన సభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. సమన్వయ కమిటీల ఏర్పాటు ద్వారా అన్నదాతల బలోపేతానికి ప్రభుత్వం క షి చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కరీంనగర్ నియోజకవర్గం మీ సేవా కార్యాలయంలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే కమలాకర్ సమావేశం ఏర్పాటు చేసి షెడ్యూలు ప్రకటించారు.. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పడ్డ నాటి నుంచి... రైతుల పరిస్థితిని గమనించిన ప్రభుత్వం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోందన్నారు. గ్రామగ్రామాన సభలు నిర్వహించి... రైతుల ప్రతినిధులను ఎంచుకునేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. నియోజకవర్గంలో షెడ్యూలు నిర్ణయించడానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మార్వోలు, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టీకల్చర్ అధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో 26 రెవెన్యూ గ్రామాలున్న నేపథ్యంలో రెండు మండలాల నుంచి 48 మంది సభ్యులు కావాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు.
Authorization