- చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- పోలీస్స్టేషన్ ఎదుట మహిళల నిరాహారదీక్ష
నవతెలంగాణ-గంగాధర
చిట్టీలపేరుతో ప్రజలకు ఆశచూపి ప్రజల నుంచి డబ్బులు కాజేసినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని మహిళలు సోమవారం గంగాధర పోలీస్స్టేషన్ ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలకేంద్రానికి చెందిన పెంచాల జమున, రాచకొండ తిరుపతిలు చిట్టీల పేరుతో అధికవడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల వద్ద ఉన్న డబ్బులను కాజేసి ప్రజలను మోసం చేస్తున్న వీరిపై పోలీసులు కఠినచర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. ఇదే గ్రామానికి చెందిన కొండా వెంకటేష్ అనే వ్యక్తివద్ద రూ.23లక్షలు పెంచాల జమున, రాచకొండ తిరుపతిలు తీసుకొని మోసం చేశారని వారు తెలిపారు. దీంతో కొండా వెంకటేష్ పెంచాల జమున ఇంటికి వెళ్లి డబ్బులు అడగగా ఆమె నిరాకరించగా మనస్థాపం చెందిన కొండా వెంకటేష్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. చిట్టీలపేరుతో అధిక వడ్డీ ఎర చూపి ఏడాదికాలంగా వీరు ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటూ మో సం చేస్తున్నారన్నారు. వీరిపై పోలీసులు కఠినచర్యలు తీసుకొని మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Authorization