నవతెలంగాణ - శంకరపట్నం ట్రాక్టర్ యజమాని ఇంటి ఎదుట శవంతో ధర్నా చేసిన ఘటన మండలంఓని ఎరడపల్లిలో చోటు చేసు కుంది. ఎరడపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ట్రాక్టర్ ఢికొన్న ఘటనలో గ్రామానికి చెందిన దూడం రాజమొగిలి అనే వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రాజమొగిలి మృత దేహంతో భార్య, కుటుంబ సభ్యులు ఆ ట్రాక్టర్ యజమాని కొయ్యాడ రాములు ఇంటి ఎదుట నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎస్సై శ్రీను సిబ్బం దితో ఎరడపల్లికి చేరుకోని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో హుజూరాబాద్ రూరల్ సీఐ రవికుమార్కు సమాచారం ఇచ్చారు. సీఐ ఏరడపల్లికి చేరుకొని రాజమొగిలి కుటుంబసభ్యులతో, బంధువులతో చర్చలు జరిపి శాఖ పరంగా తగున్యాయం చేస్తానని హామి ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు శాంతించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.