- తహసీల్దార్కు వికలాంగుల సమితి వినతి నవతెలంగాణ, గంభీరావుపేట : వికలాంగులను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు హెచ్చరించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహశీల్దార్కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలపారు. అనంతరం తహశీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. తమ సంఘం భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వ భూమి ఇవ్వాల్సిందిగా తాము పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని అన్నారు. తమను విస్మరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకు తహశీల్దార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, మండలాధ్యక్షుడు గాడిచెర్ల రాములు, ఉపాధ్యక్షుడు పెరుక పెంటయ్య, సభ్యులు కొంకటి మైసయ్య, సుంకరి మల్లయ్య, మోతె నర్సవ్వ పాల్గొన్నారు.