- కలెక్టరేట్ ఎదుట ధర్నా నవతెలంగాణ-మంకమ్మతోట సీపీఎస్ను రద్దు చేసి పాతపింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీటీవో ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీటీవో నాయకులు మాట్లాడుతూ పెన్షన్ భిక్షకాదని ఉద్యోగి హక్కు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో.ఎంఎస్ నెం. 653,54 ,55జీవోలను వెంటనే రద్దుచేయాలని 2004లో నియామకం కాబడిన ఉద్యోగ,ఉపాధ్యాయులందరికీ పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కట్కం రమేశ్, సుంకి శీల, ప్రభాకర్రావు, టీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు, టీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మోహన్నాయక్, ఎంఏఖాద్రి,వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.