- ప్రజావాణి వెలవెల నవతెలంగాణ-మంకమ్మతోట కలెక్టర్ ప్రజావాణిలో సమయానికి ముందే వెళ్లిపోవడంతో ప్రజావాణిలో వినతులు అందిస్తామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ప్రజావాణి ముప్పై నిమిషాల ముందుగానే అధికారులు, వెళ్లిపోవడంతో కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించిన, సంఘ నాయకులు వినతులు ఇచ్చేందుకు అధికారులు, అనుమతివ్వలేదు. దీంతో వివిధ సంఘాల నాయకులు నిరాశకు గురైయ్యారు. కలెక్టర్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బయటకు వస్తుండగా అక్కడే ఉన్న వృద్ధురాలు నిలబడలేకపోతున్నానని అనడంతో కలెక్టర్ వద్దకు పంపాలని అక్కడున్న అటెండర్లకు చెప్పారు. అయితే ప్రజావాణిలో ఏ ఒక్క అధికారి లేకపోవడం ప్రజావాణికి వచ్చినవృద్ధులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.