- ఏవో పోలంపెల్లి గోవర్దన్రెడ్డి నవతెలంగాణ-జమ్మికుంట వరుసగా వర్షపు ముసురు పడడం వలన రేగడి భూములలో వేసిన పత్తిచేన్లకు ఎక్కువగా వేరుకుళ్ళు తెగులు వస్తుందని దీని వలన మొక్కలు వడలిపోయి చనిపోతున్నాయని జమ్మికుంట వ్యవసాయాధికారి పోలంపెల్లి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలవల్ల నల్లరేగడిభూముల్లో ఒరపునేలలు,లోతుదుక్కి చేసిన పత్తిచేన్లకు ఈ వేరుకుళ్ళుతెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.పత్తిమొక్క మొదలు దగ్గర వర్షపునీరు నిల్వఉండడమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.ఇందకు నివారణ చర్యలు కాపర్ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్హైడ్రాక్సైడ్ 3గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి వేరు కుదుళ్ళలో పోయాలని ఆయన రైతులకు సూచించారు. 25నుండి 30 కిలోల యూరియాకు 75గ్రామలు స్ప్రింట్ తెగులు మందును కలిపి చేనులో వేసుకోవాలని ఆయన తెలిపారు. 19:19:19 (10పాలిఫీడ్)10గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేసినట్లయితే ఈ పత్తి మొక్కలు వడలిపోయి చనిపోకుండా ఉంటాయని ఏఓ తెలిపారు.