- నగర పంచాయతీ చైర్మన్ విజరుకుమార్ నవతెలంగాణ-హుజురాబాద్: ప్రజలు, పాలకుల సమిష్టి కృషితోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజరుకూమార్ అన్నారు. సోమవారం పట్టణంలోని నగరపంచాయతీ చైర్మన్ విజరుకుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించే పలు పనులకు కౌన్సిల్ తీర్మాణాలు చేశారు. హుజురాబాద్ పట్టణంలో గనేష్ నిమజ్జన ఏర్పాట్ల కోసం రూ. 4 లక్షల 50 వేలు, దసరా ఉత్సవాల నిర్వహణ కోసం రూ. 7 లక్షలు, బక్రీద్ పండుగ కోసం 80 వేల రూపాయలను నగర పంచాయతి నిదుల నుండి ఖర్చు చేసేందుకు కౌన్సిల్ సభ్యులు తీర్మాణించారు. నగరపంచాయతిలో ఏళ్ల తరబడి వృధాగా పడి ఉన్న ఇనుమును అమ్మేందుకు తీర్మాణించారు. అదే విధంగా పట్టణంలో ఈ నెల 30న అభివృద్ధి పనుల ప్రారంభోత్స కార్యక్రమం నిర్వహన ఏర్పాట్ల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ సమ్మయ్య, ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.