నవతెలంగాణ- ఇల్లందకుంట మండల కేంద్రంలో డీటీ ,బి,ఎస్,ఎస్, వరప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో చెరువులు, కుంటలు అయికట్టు నీటి ఆధారిత పంటల వివరాలపై నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. గ్రామాలలోని చెరువులు, కుంటల నీటి ఆధారిత పంటలు పండించే రైతులు పూర్తి సమాచారం వీఆర్వోల వద్దలేక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఆయా గ్రామాలకు చెందిన విఆర్ఓ లు, నీటి పారుదల శాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు, క్షేత్రస్థాయిలో వెళ్లి పంటలను పరిశీలించి అనంతరం సమావేశం నిర్వహిస్తామని అన్నారు. సమావేశంలో ప్లానింగ్ సాటిస్టికల్ అధికారిణి లక్మి , వ్యవసాయ ఆధికారిని, రజిత, నీటి పారుదల శాఖ ఏఈఈ రమేష్, విఆర్ఓలు, రవి,కుమార్, పాల్గొన్నారు.