నవతెలంగాణ-హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ఈ నెల 30న చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను నగరపంచాయతి చైర్మన్ వడ్లూరి విజరుకుమార్ పంపిణి చేశారు. సోమవారం నగరపంచాయతీ కార్యాలయంలో వివిధ కుల సంఘాలు, పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నదన్నారు. ఈ నెల 30వ తేదిన 30 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదే విధంగా రూ. 2 కోట్లతో నూతనంగా నిర్మించిన హిందూ స్మశాన వాటికను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. అబివృద్ధి పనుల ప్రారంభానికి పార్టీల కతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొళిపాక శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తాళ్లపల్లి రమేష్, బండ శ్రీనివాస్ పాల్లొన్నారు.