- టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహారావు
- కలెక్టరేట్ ఎదుట కేేజీబీవి టీచర్ల ధర్నా
- పలు ప్రజాసంఘాలు మద్దతు
నవతెలంగాణ-సిరిసిల్ల
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ.నర్సింహా రావు డిమాండ్ చేశారు. టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యం లో కేజీబీవీ ఉద్యోగులు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎమదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ సంవ త్సరం కాలంగా వేతనాలు పెంచాలని, సమస్యలు పరి ష్కరించాలని అనేక రూపాలలో కేజీబీవీ పోరాటాలు కొనసాగిస్తున్నారన్నారు. రేపు మాపు అని ప్రభుత్వం కాలం గడుపుతుందని, సమస్యలు మాత్రం పరిష్కారం కావ డం లేదన్నారు. జీతాల పెం పుదలకు కేజీబీవీ సొసైటీ తీర్మాణం చేసి 2 నెలలైన ఇంతవరకు ఉత్తర్వు లు జారీ చెయ్యలేదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. పర్మినెంట్ సంగతి పక్కనపెట్టి కనీసం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యో గులకు కనీస వేతనం చెల్లించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం వెంటనే 10వ పీఆర్సీ ఆధా రంగా స్పెషల్ ఆఫీసర్ల, ఉపాధ్యాయుల, ఉద్యోగుల వేతనాలు పెంచా లన్నారు. స్పెషల్ ఆఫీసర్లకు 37వేలు, ఉపాధ్యాయు లకు 28వేలు, పీఈటీలకు 22 వేలు, అకౌంటెంట్కు 20వేలు, ఏఎన్ఎంకు 18వేలు, వంటమనిషికి 14వేలు, 4వ తరగతి ఉపాధ్యాయులకు 13వేల చొప్పున వేత నాలు చెల్లించాలని డి మాండ్ చేశారు. విద్యా శాఖలో మహిళా ఉపాధ్యాయులకు వర్తించే ఆకస్మిక సెలవులు 20, ప్రత్యేక ఆకస్మిక సెలవులు 7 వర్తింప జేయాలన్నారు. ఉచిత వైద్యం కోసం హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. వేసవి సెలవుల వేతనాన్ని చెల్లిం చాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. వీరికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయ కులు కెకె మహేందర్రెడ్డి, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు పంతం రవి, గుంటి వేణు, బీజేపీ నాయకులు ఆడెపు రవీందర్, బీఎస్సీ నాయకులు అంకని భాను, టీజేఏసి నాయకులు బొజ్జ కనకయ్య, జనవిజ్ఞాన నాయకులు శాంతిప్రకాష్శుక్లా, కార్మీక నాయకురాలు గొట్టె రుక్మిణీ, డీటీఎఫ్, బీటీఎఫ్, ఎస్టీయూ, టీఎస్పీటీఏ, టీఎస్ఎంఎస్టిఎఫ్, ఎస్సీఎస్టీ, అధ్యక్షులు రాజేశ్వర్రావు, గంగరాజు, నారాయణ, విజరుకుమార్, శ్రీనివాస్, ఎన్ఎస్యూఏ నాయకులు మద్దతు తెలిపారు.
Authorization