- సీపీఐ ఆధ్వర్యంలో మహిళలు కలెక్టరేట్ ముట్టడి
నవతెలంగాణ-సిరిసిల్ల
పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులను తక్షణం చెల్లించాలని కోరుతూ మహిళలు సీపీఐ ఆధ్వర్యంలో కదం తొక్కారు. కార్మీక భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ సోమవారం నిర్వహించారు. కార్యాలయం ముట్టడించి ఆందోళనకు తక్షణం పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ బిల్లులను చెల్లించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 5వేల మందికిపైగా నిరుపేదలకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వా లు అవినీతికి పాల్పడ్డాయని సీబీఐ విచా రణ జరుగుతుందని సాకు తో ఇప్పటివ రకు బిల్లులు ఇవ్వలే దని పేర్కొన్నారు. ప్రభుత్వ కాలయాపణతో బిల్లులు రాక నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కౖనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశల వారిగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిం చారు. ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కెకె మహేందర్రెడ్డి సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే విధానాలు మానుకుని న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు సామాల మల్లేశం, ఎలిగేటి రాజశేఖర్, శ్రీనివాస్, చంద్రయ్య, లచ్చయ్య, అంగూరి రంజిత్ మహిళలు పాల్గొన్నారు.
Authorization