- ఆరేండ్లుగా రాజన్న ఆలయ ఉద్యోగుల నిరీక్షణ
- అంతర్గత విభేదాలతో ఆగిపోయిన ప్రమోషన్లు
- మూడేండ్లుగా కోర్డుల చుట్టూ ప్రదక్షిణలు
నవతెలంగాణ-వేములవాడ
తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద శైవక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో పని చేస్తున్న ఆలయ ఉద్యోగులకు ఆరేండ్లు గడిచినా అంత ర్గత బదిలీలు జరగడం లేదు. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య విభేదాలు రావడంతో సీనియారిటీ నాదే అంటూ కొంతమంది ఉద్యోగులు కోర్డులకెక్కడం తో ప్రమోషన్లు కూడా నిలిచిపోయాయి. రాజన్న ఆల యంలో సుమారుగా 350 మంది పర్మినెంట్ ఉద్యోగు లు పనిచేస్తుండగా వారికి ప్రతీ రెండు సంవత్సరముల కొకమారు అంతర్గత బదిలీలు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికి తూతూమంత్రంగా కొంతమంది సిబ్బంది కి మాత్రమే అంతర్గత బదిలీలుచేసి అధికారులు చేతు లు దులుపుకుంటు న్నారు. సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఉన్నత స్థాయికి పదోన్నతి పొంది నప్పటికీ ఆ ఉద్యోగులు మాత్రం ఆ సీట్లను వదలకుం డా అక్కడే తిష్ట వేస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారని ఆలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా ఉన్న సిబ్బం దిని అదే సీట్లలో ఏండ్ల తరబడి కొనసాగిస్తూ కొంత మంది ఉద్యోగులను మాత్రం అంతర్గత బదిలీలు చేయడంతో వారు తమ అక్కసును ప్రజాప్రతిని ధులతో వెల్లబో సుకుంటున్నట్టు సమాచారం. నిత్యాన్న ద ాన సత్రంలో మరియు స్టేషనరి విభాగంలో సీనియ ర్ అసిస్టెంట ్లను వేయాల్సివుండగా జూనియర్ అసి స్టెంట్, రికార్డు అసిస్టెంట్లను వేయడం ఇందుకు ఉదాహరణ అని వాపోతున్నారు. రాజన్న ఆలయంలో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు రావాల్సివుండగా ఉద్యోగుల మధ్య విభేదాలు తలెత్తి కొంతమంది సిబ్బం ది కోర్టుకు వెళ్లడంతో ఉద్యోగుల పదోన్నతులు కూడా నిలిచిపో యాయి. ఆలయంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక ఏఈవో పోస్టు, సీనియర్ అసిస్టెంట్లను భర్తీ చేస్తే సుమారుగా 17 మంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉందని, ఉద్యోగుల సీనియారిటీ గొడవల వల్ల పదోన్నతులు ఆగిపోయి 3 సంవత్సరాల నుంచి సర్వీసు సంబంధిత ప్రయోజనాలు నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆలయ ఈవో అంతర్గత బదిలీలు, పదోన్నతులపై దృష్టిసారించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Authorization