- ప్రాధాన్యత తగ్గుతున్న తెలుగుభాష
- కలగలిపి మాట్లాడుతున్న వైనం
- నేడు తెలుగుభాష దినోత్సవం
తెలుగు భాష తీయదనం..తెలుగుభాష గొప్పతనం తెలుసుకున్నవాళ్లకు తెలుగే ఒక తీయదనం.. ఓ సినీకవి కలం నుంచి జాలువారిన అక్షర సత్యం ఇది. అమ్మా అనే పిలుపుతోనే తెలుగు మాధుర్యాన్ని పంచుతుంది. ఏలికలు మేల్కొని తేనెలొలుకు తేట తెలుగును రక్షించుకోకపోతే కొవ్వొత్తిలా కరిగిపోతుంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త, తేట తెలుగు భాషను ముందు తరాలకు వారసత్వంగా అందించిన దార్శనిక కవి గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని..తెలుగు భాషా దినోత్సవంగా ప్రతియేటా ఆగస్టు 29న నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ- కరీంనగర్
తేనెలొలికే భాష తెలుగు. అమ్మదనం నిండిన కమ్మనైనభాష తెలుగు. ఏ దేశమేగినా నీ ఆత్మబంధువు తెలుగు. వ్యాసుడు రచించిన మహాభారతంలో తెగులు కనబడుతుంది. తేనె అంటే దక్షిణ దిక్కు అని ఒక అర్థం. అందుకే దక్షిణాదిన నివసించేవారు కాబట్టి తెనుగువారు అంటారనేది ఒక వాదన.ఉమ్మడి ఆంధ్ర దేశ్లో 2700 సంవత్సరాలకు పూర్వమే అచ్చ తెలుగు గ్రంథాలు లభ్యమయ్యాయి. నన్నయ్య కాలం నుంచి ఇంకా ఎక్కువ గ్రంథాలు అందుబాటులోకి వచ్చాయి. తెలుగుభాష శాతవాహనుల కాలం నుంచి ఉన్నప్పటికీ ఇక్ష్వాకుల కాలంలో చాలా అభివద్ధి సాధించింది. చాళుక్యుల కాలంలో శాసనాలు లభ్యమయ్యాయి. తెలంగా, తెలింగా, తిలాంగ్ అనేవి తెలుగు లిపికి ఉన్న పేర్లు. భారతదేశంలో ఉన్న ప్రస్తుత ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగుకు మూలం సంస్కతం. ప్రపంచంలో ఎక్కు వగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగు 15వ స్థానంలో ఉంది. ఇంచుమించు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగు వారు ఉండనే ఉంటారు. అయితే గత చరి త్రను తవ్వుకుని సంఖ్యా ఆధిక్యాన్ని చాటు కొని కాలం వెళ్లదీసుకుం టున్నామే కానీ, నేటి సమాజంలో తెలుగుభాషాస్థితిని తల్చుకుంటే కొంత బాధకలగక మానదు.
2006లో ప్రాచీన హోదా..
2006 సంవత్సరంలో తెలుగు భాషకు ప్రాచీన హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే కొందరు దీనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.కానీ ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలు న్నాయని స్పష్టం చేసింది మద్రాసు హైకో ర్టు. తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించ డాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖ లైంది. అయితే తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయ వాదులు, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కతిక సంఘం మద్రాసు హైకో ర్టుకు పూర్తి వివరాలు అంద జేశారు. దీంతో తెలుగు భాష ప్రాచీనమేనని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది.
భాష అభివృద్ధి కోసం వందకోట్లు
ప్రాచీన హోదా లభించడం వల్ల..భాష అభివద్ధి కోసం కేంద్రం ఐదేళ్లకొకసారి రూ.వంద కోట్లు కేటాయిస్తోంది. దీనివల్ల ఆ భాషకు సంబంధించి అంతర్జాతీయ సద స్సులు నిర్వహించుకోవచ్చు. అంతర్జాతీయ, జాతీయ పురస్కారాల ప్రదానంతోపాటు తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని ఇతర భాష ల్లోకి అనువదించి, పుస్తకాలను ముద్రించి ప్రచారం చేసుకోవచ్చు. ప్రాచీన హోదా రాగానే ఆ భాషకు సంబం ధించి ప్రత్యేక కేంద్రం ఏర్పాటవుతుంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది.
సంగీతానికి అనువైన భాష తెలుగు
తెలుగు భాష సంగీతానికి అనువైన అజంత భాషగా చెప్పవచ్చు. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగువారికి కలసివచ్చిన గొప్ప అదష్టం మన మాత బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పద్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటా యని సహధ్యా యులందరికీ విధితమే. పధ్య కవిత్వంతోపాటు తెలుగు భాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర భాషల్లోనూ లేవు. రామదాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపిం చాయి. తాళ్లపాక అన్నమాచార్యులు ముప్పై రెండువేల కీర్తనలు రచించారు. తెలుగువారి కళాభి నివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు.
మాత భాషలో విధ్యాబోధన
గాంధీజీ 1938లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావప్రేరణ, ప్రగతి, మాతబాష వల్లనే వస్తుందని, స్వభాషలో విద్య ఉంటే మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని 'గాంధీజీ' పేర్కొన్నారు. మాతభాషలో విద్యాబోధన వల్ల మన షులు చురుకుగా పనిచేస్తాయని రవీంద్రుడు చెప్పాడు. మాతభాషలో విద్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగు తుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ''మాతృ భాషలో విద్యాబోధన వల్ల విద్యార్థుల్లో సజ నాత్మకత పెరుగుతుంది''.
అధికార భాషగా తెలుగు
తెలుగును పరిపాలనా భాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966లో తెలుగును అధికారభాషగా ప్రవేశపెట్టిన బిల్లు చట్టమైంది.ప్రభుత్వశాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యు త్తరాలు నడపాలని 1966 డిసెంబర్లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా భాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించడానికి పింగళి లక్ష్మీకాంతం, జిఆర్పి గ్విన్ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రభు త్వంలో ఒకశాఖగా 1974 మార్చి 19న ''అధికార భాష సంఘం'' ఏర్పడింది. ప్రతిఒక్క విద్యార్థి ఒక సైనికుడి తరహాలో మాతభాష అయిన తెలుగు గొప్పదనాన్ని అందరికీ చాటాలి. తెలుగుభాష మన అధికార భాష. కమ్మనైన తెలుగుభాషను కలలోనూ మరువరాదు. అమ్మపాల కమ్మదనం తెలుగులో ఇమిడి ఉంది. ఘనమైన తెలుగుదనాన్ని రాబోవు తరాలకు గొప్ప ఘనచరిత్రగా మనం అందించాలి.
తెలుగు బాష ప్రాముఖ్యత
''దేశ భాషలందు తెలుగు లెస్స'' అని శ్రీకృష్ణదేవ రాయులు అన్న మాటకు అర్థం మనదేశంలో ఎన్ని భాష లున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు. తెలుగు భాషలోని మాధుర్యం అంతాఇంతా కాదు. ఉగ్గుపాల నుంచి ఒక బిడ్డకి తల్లిపాట పాడేందుకు వీలైన భాష. తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటా యి.ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.
మరిచిపోతున్న తెలుగుపదాలు
ఇకపోతే ఇప్పటికాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపో తున్నారు. పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండ టానికి చాలా కారణాలు ఉండవచ్చు. వారు పెరుగు తున్న వాతావరణం, తల్లిదం డ్రులు, పాఠశాలలు, స్నేహి తులు మొదలైనవి. మొదటి పదమైన ''అమ్మ'' అనే పదానికి బదులు మమ్మీ, మామ్ అని అక్కడ నుంచి ప్రతిపదం. ప్రతీ సందర్భం, ప్రతి చోట కూడా పిల్లలు తెలుగుకి బదులుగా ఇతర భాషల పై మోజూ చూపు తారు. పిల్లలే కాదు, పెద్దవారు సైతం తెలుగులో మాట్లాడితే అదేదో తప్పని లేదంటే చుట్టుపక్కలవాళ్లు మనకు నాగరికత తెలియదని అనుకుంటారని ఇతర భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారు. ఇది చూసిన పిల్లలు ఇదే పద్ధతిని పాటిస్తారు. కానీ అది తప్పు. ఎవరి మాతభాషలో వారు మాట్లాడటం వారి హక్కు. అలా అని అభివద్ధి చెంద కూడదనికాదు. (నాగరికత విషయంలో) పరభాషా జ్ఞానాన్ని సంపాదించు కోవడంలో తప్పులేదు.
మన తెలుగు కవులు
అందులో ప్రప్రధమంగా నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతం వంటి గొప్ప కావ్యాన్ని సంస్కతం నుంచి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యేవిధంగా, చక్కగా అనువదించారు. ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సినారె, సామల సదాశివ, అందెశ్రీ, దాశరథి వంటి మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు. తెలుగులో కవిత్వం మన ఆది కవి ''నన్నయ'' గారి మహాభారతం నుంచి అంటే 11వ శతాబ్దం నుంచి మొదలైంది అనుకోవడంలో ఎటువంటి సందేహమూలేదు. తెలుగు భాష తేనెవలె మధురంగా ఉంటుంది. ''సంస్కతంలోని చక్కెర పాకం, అరవ భాషలోని అమతరాశి, కన్నడ భాషలోని తేట, ఇవన్నీ తెలుగు నందు కలవు'' అని శ్రీకష్ణ దేేవరాయల వారు తెలిపారు. తెలుగుభాష ద్రావిడ భాష నుంచి వచ్చింది
- గిడుగు రాంమూర్తి
Authorization