నవతెలంగాణ-జమ్మికుంట జాతీయ స్థాయి 64వ స్కూల్ గేమ్స్ పోటీలలో జమ్మికుంటకు చెందిన విద్యార్థులు పాల్గొనడంతో పాటు ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ విద్యార్థుల ను పట్టణ సీఐ సృజన్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 9 వరకు మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన హుస్కాండో జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరుపున రొడ్డ వినీల సెయిన్ అండర్-17 బాలికల విభాగంలో బంగారు పతకాన్ని, అలాగే అండర్-17 బాలుర విభాగంలో ఎండి ఆసిష్పాషా కాంస్య పతకాన్ని సాధించడం జమ్మికుంటకే గర్వకారణ మన్నారు. జాతీయస్థాయి పోటీలలో అండర్ -17 బాలికల విభాగంలో రాష్ట్రానికి తృతీయస్థానం వచ్చిందన్నారు. జాతీయస్థా యిలో జమ్మికుంట పేరును నిలబెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకు వచ్చిన వారిని పుష్పగుచ్ఛాలతో అభినందిం చడంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.