- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి
నవతెలంగాణ-సిరిసిల్ల
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువుగా పోలింగ్ రోజున ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రామరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడత ఎన్నికలు జరిగే 5 మండలాల ఉద్యోగులు, కార్మికులకు ఈ నెల 21న సెలవు ప్రకటించారు. మొదటి దశ పోలింగ్ 21న వేములవాడ రూరల్, అర్భన్, చందుర్తి, రుద్రంగి, బోయినిపల్లి మండలాల్లో, రెండో దశ పోలింగ్ 25న 4 మండలాల్లో, మూడో దశ పోలింగ్ 30న 3 మండలాల్లో నిర్వహిస్తున్నారు. పోలింగ్ తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, కార్మిక చట్టం వర్తించే కర్మాగారాలు, సంస్థలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలు, కళాశాలలకు పోలింగ్ రోజు సహా అంతకు ముందు రోజుతో కలిపి రెండు రోజులు సెలవులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు అనువుగా ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ఇచ్చారు. పోలింగ్కు ముందు రోజు విద్యాసంస్థల భవనాలు స్వాధీనం చేసుకుని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల విధుల్లోని అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
21న ప్రజావాణి రద్దు : కలెక్టర్
ఈ నెల 21న నిర్వహించే ప్రజావాణిని తాత్కలికంగా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలోని 5 మండలాల్లో తొలవిడత గ్రామపంచాయాతీ ఎన్నికలు జరుగుతుండగా, జిల్లా యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగమవడంతో సోమవారం ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గమనించి సహకరించాలని సూచించారు.
Authorization