నవతెలంగా-జమ్మికుంట హుజూరాబాద్ ప్రాంత ప్రజల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వికలాంగుల సంఘం నాయకులు నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూరాబాద్ను వెంటనే జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సాధన సమితి నాయకులు రావులపల్లి సదానందం కుమార్, వడ్లూరి వాసు, రామంచ నర్సింహ, రవి శ్రీనివాస్, సాయి, వికలాంగుల సంఘం నాయకులు ప్రవీన్, రంగన్న, సదాచారి, మహిపాల్, రమేష్, సంపత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.