నవతెలంగాణ-వేములవాడ వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఉచిత నిత్యాన్నదాన సత్రంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ కూరగాయల రాములును విచారణ కార్యాలయానికి బదిలీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ జీ.నర్సింహమూర్తికి ప్రస్తుతం అనుబంధ ఆలయాల పరిశీలకులు, వేదపాఠశాల నిర్వాహణ ఇన్చార్జితోపాటు అదనంగా నిత్యాన్నదాన సత్రం బాధ్యతలను ఆలయ ఈవో దూస రాజేశ్వర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.