- సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ రమణాచారి నవతెలంగాణ-సిరిసిల్లటౌన్ సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద నిర్మాణం చేపడుతున్న మ్యూజికల్ ఫౌంటేన్ను గడువులోగా పూర్తి చేయాలని, లేదంటే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషన్ రమణాచారి అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ పరిశీలించారు. నెహ్రునగర్లో నిర్మితమవుతున్న వైకుంఠ ధామం, ఇందిరానగర్లోని ఇందిరాపార్క్, అక్షయపాత్ర లోకేషన్లను సందర్శించి పనుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత ప్రమణాలను పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట మేనేజర్ వెంకటనారాయణ, టీపీవో అన్సారీ, ఆర్వో రాధాకిషన్, ఇంజీనర్లు వరుణ్, వెంకటేశ్ ఉన్నారు.