ముగిసిన జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ ఎంపిక పోటీలు
నవతెలంగాణ-వేములవాడరూరల్ పార్లమెంట్ యూత్ ఫెస్టివల్ 2019లో భాగంగా మూడు రోజులుగా జరుగుతున్న యువతి, యువకుల ఉపన్యాసక పోటీలు శనివారం ముగిశాయి. మండలంలోని అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉపన్యాసక పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 60 మంది పాల్గొన్నారని కళాశాల ప్రిన్సిపాల్ తిరుకోవెల శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి వడ్లూరి శ్రీనివాస్ తెలిపారు. అత్యంత ప్రతిభ కనబరిచిన నలుగురిని శాతవాహన యూనివర్శిటీలో 24న జరిగే యూనివర్సిటీ స్థాయి పోటీలకు పంపిస్తున్నటుట తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నర్సయ్య, రమాదేవి, మల్లారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాసులు, మధు, రాజేశ్, జగన్గౌడ్, ఎన్ఎస్ఎస్ వాలీంటర్లు పాల్గొన్నారు.