- రెండవ రోజు విద్యార్థుల ప్రదర్శనలు
నవతెలంగాణ-తంగళ్లపల్లి
చిన్నారి లేత మెదడులోంచి మొలకెత్తిన ఓ ఆలోచన అద్భుత ఆవిష్కరణకు దారితీసింది. తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం అంతర్లీనంగా దాగి ఉన్న ఆలోచనలకు మరో విద్యార్థి పదునుపెట్టింది. అవకాశం ఇస్తే తమ ప్రతిభను ఆకాశం అంచున తాకేలా చూపగలమని విద్యార్థులు చాటి చెప్పారు. విద్యార్థులు చేసిన సైన్స్ఫేర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తంగళ్లపల్లి మండలం మండెపల్లి మోడల్స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శన శనివారం రెండవ రోజు అద్దం పట్టింది. రాజన్న సిరిసిల్ల డీఈవో రాధాకిషన్ ప్రదర్శనను తిలకించారు. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలను ఇన్స్పైర్ అవార్డు విద్యార్థులు గైడ్ టీచర్లు 235 మంది పాల్గొన్నారు. వారు తయారుచేసిన ప్రాజెక్టులు మోడల్స్లతో హాజరై ప్రదర్శించారు. రెండవ రోజు సందర్శకులతో సందడిగా మారింది. జాతీయస్థాయిలో భారతదేశ శాస్త్రీయ సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో 2009-10నుంచి పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడానికి ఇన్స్పైర్ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. శాస్త్రీయ విజ్ఞాన రంగంలో పరిశోధన చేయడానికి ఈ రంగంలో ఔత్సాహికులను గుర్తించి ప్రోత్సహించడానికి ఇన్స్పైర్ అవార్డు మానక్ద్వారా 6వ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రాథమిక స్థాయిలో ఎంపికైన ప్రతిభావంతులకు రూ.10వేల నగదును ప్రాజెక్టు మోడల్ తయారు చేసేందుకు ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తమ మేధస్సును పదునుపెట్టి ఆవిష్కరించిన ప్రాజెక్టులు సిరిసిల్ల ప్రాంతం నలుమూలల నుంచి తరలివస్తున్న వివిధ పాఠశాల విద్యార్థులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల సైన్స్ అధికారులు ఆంజనేయులు, రవీందర్రావు, ఎంఈవో రాంచందర్రావు, పరబ్రహ్మమూర్తి, కన్నం రమేష్, లాల శ్రీనివాస్, జక్కని నవీన్, రాజేంద్రశర్మ, శ్రీనివాస్, పాకాల శంకర్గౌడ్, సంతోష్, అశోక్,తదితరులు పాల్గొన్నారు.
Authorization