నవతెలంగాణ-కోనరావుపేట
మాఘ మాస జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని ఆలయ ఏఈవో ఉమారాణి అన్నారు. మండలంలోని మామిడి పల్లి గ్రామం లోని కోదండ రామస్వామి ఆలయంలో మాఘమాస జాతర ఏర్పాట్లపై అధికారులతో శనివారం సమావేశం నిర్వహంచారు. ఈ సమావేశంలో ఏఈవో మాట్లాడుతూ జాతరలో భక్తుల సౌకర్యార్థం తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ దార ప్రసాద్, ఎస్ఐ నరేశ్ కుమార్, ఆలయ ఇన్చార్జి నరేందర్, ఎంపీటీసీ రాజు లక్ష్మి, మాజీ సర్పంచ్ పొన్నాల విజయ లక్ష్మిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేములవాడ : ఈ నెల 22న మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంపై శనివారం సాయంత్రం ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఆలయ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి జాతరకు లక్షలాదిమంది భక్తులు రానున్నందున ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఈ నెల 22న ఆలయ ఓపెన్స్లాబ్లో సమావేశం నిర్వహిస్తుండటంతో ఆలయ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు విభాగాలకు చెందిన ఏఈవోలు, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
Authorization