- వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు
నవతెలంగాణ-రుద్రంగి
గ్రామాభివృద్ధికి పాటుపడే వారినే సర్పంచ్గా గెలిపించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ బలపర్చిన రుద్రంగి గ్రామ సర్పంచ్ అభ్యర్థి తలారీ మణి నరసయ్యకు మద్దతుగా శనివారం నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే రమేశ్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడటంలో సర్పంచ్ది క్రియాశీలక పాత్ర అని చెప్పారు. ప్రజలు లోతుగా క్షుణ్ణంగా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలన్నారు. తలారి మణి నరసయ్య గుర్తు కప్పు సాసరుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని రానున్న కాలంలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పట్టం కట్టారని, మళ్లీ అదే ఉత్సాహంతో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పీటీసీ అంబటి గంగాధర్, గంగాధర్ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మాడిశెట్టి ఆనందం, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కేశవరెడ్డి, దేవస్థానం చైర్మన్, నాయకులు శంకర్, తోకల తిరుమల్, ఆకుల గంగారం, భరత్, మల్లేశం, కొమురయ్య, కంటేరెడ్డి పిడుగులు పాల్గొన్నారు.
Authorization