నవతెలంగాణ-తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్పార్క్ ఇందిరమ్మ కాలనీ మాజీ సర్పంచ్ వేముల శ్రీమతి నామినేషన్ను అధికారులు శనివారం తిరస్కరించారు. మూడో విడతలో జరిగిన నామినేషన్ల పర్వంలో మాజీ సర్పంచ్ వేముల శ్రీమతి మండెపల్లి నామినేషన్ కేంద్రంలో నామినేషన్ను దాఖలు చేసింది. శనివారం పరిశీలన ఉండగా అందులో అదే టెక్స్టైల్పార్క్ ఇందిరమ్మకాలనీకి చెందిన మరో అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అధికారులు అడగడంతో వేముల శ్రీమతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని అందులో ఒకరు 1995 తర్వాత పుట్టిన వారేనని ఆధారాలతో లాయర్లు అధికారులకు చూపడంతో నామినేషన్ను అధికారులు తిరస్కరించారు.