నవతెలంగాణ-సిరిసిల్లటౌన్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో బీసీటీఏ క్యాలెండర్ను డీఈవో రాదాకిషన్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్గౌడ్ మాట్లాడుతూ బీసీ ఉపాధ్యాయుల సమస్యల కోసం బీసీటీఏ పోరాడుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్లే పాత పెన్షన్ విధానానికి ముప్పు వాటిల్లిందన్నారు. పాత పెన్షన్ విధానానికి అమలు చేయడం కోసం బీసీ ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో బీసీ ఉపాధ్యాయుల సమస్యల కోసం బీసీ ఉపాధ్యాయుల సంఘం తమ వంతు పోరాటాలను నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విక్కుర్తి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బండారి మల్లేశం, జిల్లా అధ్యక్షులు పులి రాంగోపాల్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల సుదర్శన్, దేవదాస్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తాటికొండ కృష్ణహరిలు పాల్గొన్నారు.